మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్రంతో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’తో సత్తా చాటిన చిరు ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, అందులో మెగాస్టార్ పాల్గొంటున్నాడు. మోహనరాజా  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆచార్య’ ఫిల్మ్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ఇంకా రెండు పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ‘సిద్ధ’ అనే పాత్రలో కనిపించనున్నారు. చరణ్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుండగా, మెగాస్టార్ చిరు సరసన బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. యాక్చువల్‌‌గా ‘ఆచార్య’ చిత్రం ఈ ఏడాది మే లోనే విడుదల కావాల్సి ఉంది.

కానీ, కొవిడ్ వల్ల పోస్ట్‌పోన్ అయింది. కాగా, ఈ చిత్ర విడుదల తేదీపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే, నెక్స్ట్ ఇయర్‌లోనే ‘ఆచార్య’ విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో ఈ సినిమాను నిలిపితే బాగుంటుందని మెగాస్టార్‌తో పాటు డైరెక్టర్ కొరటాల అనుకుంటారని టాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ‘లూసిఫర్’ రీమేక్ మూవీ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్‌లో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ హీరోగా వచ్చిన ‘లూసిఫర్’ బాక్సాఫీసు వద్ద సూపర్ సక్సెస్ అయిన సంగతి అందరికీ విదితమే. కాగా, ఈ చిత్ర తెలుగు రీమేక్‌లో నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత మరో రీమేక్ చేయబోతున్నారు చిరు. తాలా అజిత్ నటించిన ‘వేదాళం’ రీమేక్‌లో చిరు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నారు. మొత్తంగా మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరు ప్రస్తుతం రీమేక్ మూవీసే చేస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: