అనుష్క ఎప్పుడైతే వెయిట్ పెరిగిందో అప్పటి నుంచి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. 'భాగమతి' తర్వాత లాంగ్గ్యాప్తో విడుదలయిన 'నిశ్శబ్ధం' సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా సంతృప్తిపరచలేకపోయింది. పైగా స్వీటీ లుక్పై చాలా కామెంట్స్ వచ్చాయి. అనుష్కలో మునుపటిలా ఉండే కళ తగ్గిపోయిందనీ, అస్సలు ఏం బాగోలేదనే విమర్శలొచ్చాయి. అప్పటి నుంచి మరో మూవీకి సంతకం పెట్టలేదు అనుష్క.
'జాతిరత్నాలు' సమయంలో అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందనే ప్రచారం జోరుగా వినిపించింది. 'మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి' టైటిల్తో ఆ సినిమా తెరకెక్కుతుందనే సమాచార వచ్చింది. యువి క్రియేషన్స్లో 'రారా క్రిష్ణయ్య' ఫేమ్ మహేశ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తాడనే మాటలు కూడా వినిపించాయి. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ సైడ్ ట్రాక్ పట్టిందని చెప్పుకుంటున్నారు సినీజనాలు.
అనుష్క మళ్లీ మునుపటి లుక్లోకి రావాలని ప్రయత్నిస్తోందట. కిలోల కొద్ది బరువుని తగ్గించుకున్న తర్వాతే మళ్లీ కెమెరాముందుకు రావాలనుకుంటోందట స్వీటీ. అందుకే ఈ 'మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి'ని పోస్ట్ పోన్ చేసిందని టాక్. అయితే కొందరు మాత్రం అనుష్క ఇంక సినిమాలు చేయడం కష్టమేననీ.. బరువు తగ్గి ఇప్పుడున్న హీరోయిన్లకి కాంపిటీషన్గా మారే సరికి వయసు అయిపోతుందని కామెంట్ చేస్తున్నారు. మరి అనుష్క బరువు తగ్గి మళ్లీ కెమెరా ముందుకు ఎప్పుడొస్తుందో చూడాలి. అనుష్క ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందా.. లేక వెడ్డింగ్ కార్డ్ తో సినీ కెరియర్ కు ఎండ్ కార్డ్ వేస్తుందో చూడాలి.