టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. వాటిలో ఒకటి ఆచార్య కాగా మరొకటి మలయాళ సినిమా లూసిఫర్ తెలుగు రీమేక్. అయితే వీటిలో ఆచార్య ఇప్పటికే ఆల్మోస్ట్ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. రామ్ చరణ్ ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మెసేజ్ తో పాటు యాక్షన్, కమర్షియల్ కలగలిపిన సినిమాగా ఈ మూవీని కొరటాల శివ తీస్తున్నట్లు సమాచారం.
ఇక దీని తరువాత మెగాస్టార్ చేస్తున్న లూసిఫర్ రీమేక్ కి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మెగాసూపర్ గుడ్ ఫిలిమ్స్ అలానే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు దీనిని నిర్మిస్తున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే రేపు మెగాస్టార్ జన్మదినం సందర్భంగా ఉదయం 9 గంటలకు మెహర్ రమేష్ తో ఆయన చేయనున్న సినిమా యొక్క టైటిల్, ఫస్ట్ లుక్ అనౌన్స్ కానుంది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా ఒక అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

కాగా ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల తమిళ్ లో అజిత్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ కొట్టిన వేదాళం తెలుగు రీమేక్ గా ఈ మూవీ రూపొందనుంది. కాగా లేటెస్ట్ ఫిలిం నగర్ న్యూస్ ప్రకారం ఈ సినిమాకి భోళా శంకర్ అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసినట్లు టాక్. మరి తొలిసారిగా మెగాస్టార్ తో మెహర్ రమేష్ చేస్తున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ అందుకుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాలి ....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: