కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని ప్రఖ్యాత నిర్మాత దానయ్య దాదాపుగా రూ.500 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా ఒలీవియా మోరిస్, చరణ్ కి జోడీగా అలియా భట్ నటిస్తున్నారు. భారీ యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా పీరియాడిక్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వచ్చింది. తమ సినిమాని అక్టోబర్ 13న పక్కాగా విడుదల చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే ఈ మూవీ పక్కాగా వచ్చే ఏడాది ఉగాదికి వాయిదా పడినట్లు సమాచారం.
ఇప్పటికే ఈ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్ అందరికీ చేరడం జరిగిందని, త్వరలోనే మేకర్స్ ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇవ్వనున్నారని టాక్. అయితే మరొక్కసారి ఆర్ఆర్ఆర్ వాయిదా పడడంతో ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇది నీకు తగునా జక్కన్న అంటూ రాజమౌళి ని ఉద్దేశించి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా జరుగుతోందని, తప్పకుండా రిలీజ్ తరువాత మూవీ భారీ సక్సెస్ కొడుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. .....!!