రష్మిక మందన్న కన్నడలో 'కిరిక్ పార్టీ'తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిందో లేదో, ఈ మూవీ రిలీజ్ కాగానే ఎంగేజ్మెంట్ చేసింది. 'కిరిక్ పార్టీ' స్టార్ రక్షిత్ శెట్టికి రింగ్ తొడిగేసింది. అయితే రష్మిక టాలీవుడ్కి వచ్చాక ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యింది. అయితే తెలుగులో వరుస అవకాశాలు అందుకుని ఇక్కడ టాప్ హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఒక సినిమా, అమితాబ్ బచ్చన్తో ఒక సినిమా చేస్తోంది.
నయనతార పర్సనల్ లైఫ్ కోసం సినిమాలని కూడా త్యాగం చెయ్యడానికి సిద్ధమైంది. ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నప్పుడు సినిమాలు మానేస్తానని స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. ప్రభుదేవాతో పెళ్లి కన్ఫర్మ్ కాగానే, సినిమాలకి గుడ్ బై అని ఎమోషనల్ అయ్యింది. 'శ్రీరామరాజ్యం' సెట్స్లో సెండాఫ్ కూడా ఇచ్చారు. అయితే ఈ రిలేషన్ పెళ్లిపీటలెక్కుండానే విడిపోయింది. నయనతార ఫస్ట్ ఇన్నింగ్స్లో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది గానీ, వాళ్లతో సమానమైన ఇమేజ్ తెచ్చుకోలేదు. అయితే ప్రభుదేవాతో విడిపోయాక స్ట్రాంగ్ రోల్స్ ప్లే చేసింది. 'రాజారాణి, నానుమ్ రౌడీధాన్, అరమ్' లాంటి సినిమాలతో లేడీ సూపర్స్టార్ అనిపించుకుంది. రీసెంట్గానే విఘ్నేష్ శివన్తో నయన్కి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. కుమారి త్రిష ఆరేళ్ల క్రితమే శ్రీమతి త్రిష మనియన్గా మారిపోయేది. బిజినెస్మెన్ కమ్ ప్రొడ్యూసర్ వరుణ్ మనియన్తో 2015లో త్రిషకి ఎంగేజ్మెంట్ అయ్యింది. అయితే పెళ్లి డేట్ ఫిక్స్ అవుతోన్న టైమ్లో ఇద్దరూ విడిపోయారు. ఇక ఈ బ్రేకప్ తర్వాత త్రిష మళ్లీ సినిమాలతో చాలా బిజీ అయిపోయింది.