ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుసగా ఒకదానివెంట మరొకటి సినిమాలు ఎంచుకుంటూ యువ హీరోలకంటే కూడా మరింత వేగంగా కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు. కాగా ప్రస్తుతం కొరటాల శివ తో ఆయన చేస్తున్న సినిమా ఆచార్య ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనితో పాటు నేడు మెగాస్టార్ జన్మదినం సందర్భంగా తదుపరి ఆయన నటించనున్న రెండు సినిమాల అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.

వాటిలో ముందుగా మోహన్ రాజాతో చేయనున్న మూవీకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఖరారు చేసారు. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి ఆఫీషియల్ రీమేక్ గా ఇది రూపొందుతోంది. ఇక దీనితో పాటు మెహర్ రమేష్ తీయనున్న సినిమాకి భోళా శంకర్ అనే టైటిల్ ఖరారు చేయడం జరిగింది.

అజిత్ హీరోగా తమిళ్ లో ఇటీవల సూపర్ హిట్ కొట్టిన వేదాళం కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థలు నిర్మిస్తుండగా ఈ మూవీలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్, మెగాస్టార్ సోదరిగా నటిస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ఒక వీడియో ద్వారా తెలిపింది యూనిట్. నేడు రక్షాబంధన్ పర్వదినం కూడా కావడంతో ఈ సందర్భంగా భోళా శంకర్ లో చెల్లెలుగా నటించనున్న కీర్తి, మెగాస్టార్ చేతికి రాఖీ కట్టే వీడియో విడుదల చేసారు. ఈ పాత్రతో మెగాస్టార్ తో నటించాలన్న తన కల నెరవేరిందని తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కీర్తి సురేష్ తెలిపారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుంది. మరి తొలిసారిగా మెగాస్టార్ తో మూవీ తీస్తున్న మెహర్ రమేష్ దీనితో ఏ స్థాయి విజయం అందుకుంటారో చూడాలి .... !!


మరింత సమాచారం తెలుసుకోండి: