టాలీవుడ్
సినిమా ప్రపంచాన్ని ఓ దశాబ్దకాలం పాటు మహారాణిలా ఏలిన
హీరోయిన్ త్రిష. ఇటీవల కాలంలో మంచి అవకాశాలు అందుకోలేకపోతుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రమే పరిమితం అవుతూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. తెలుగులో సినిమాలు తక్కువ అయిన నేపథ్యంలో
తమిళ ఇండస్ట్రీలో ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మొదలు పెట్టింది ఈ ముద్దు గుమ్మ. ఆ విధంగా ఆమె నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల అయి ప్రేక్షకుల ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి.
వాటి ఫలితాల సంగతి ఎలా ఉన్నా గత 20 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను తన సినిమాలతో అందాలతో మెప్పిస్తూనే త్రిష. ఇదిలా ఉంటే ఆమె ఇటీవలే ఓ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సంఘటన అందరిలో ఒక్కసారిగా కలవరం సృష్టిస్తుంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాంతంలో గల ప్రసిద్ధి చెందిన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు త్రిష. ఈ పూజలు నిర్వహించిన కారణం మంచిదే అయినా ఇది
తమిళ నాట పెద్ద అంశం అయ్యింది.త్రిష కు తగిన అవకాశాలు ఉన్నాయి కానీ హిట్ లు మాత్రం దక్కడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రస్తుతం చేస్తున్న క్రేజీ
సినిమా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న
సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
పొన్నియన్ సెల్వన్
సినిమా లో
త్రిష కీలక పాత్రను పోషిస్తుంది.
మహారాష్ట్ర నుండి వచ్చే ఈ ప్రాంతంలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుండగా అక్కడ ప్రసిద్ధి చెందిన ఓ దేవాలయం ఉంది అని తెలుసుకున్న
త్రిష అక్కడికి వెళ్లి పూజలు నిర్వహించి ఎలాంటి ఆటంకం లేకుండా విజయవంతంగా ఈ
సినిమా పూర్తి కావాలని ఆమె దేవుని కోరుకున్నారట. కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం మధ్యప్రదేశ్లోని ప్రాంతానికి వెళ్లడం జరిగింది. అక్కడ ఈ
సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా ఆమె ఆ గుడిలో పూజ చేసిందట.
కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జయం రవి, కార్తీ,
ఐశ్వర్య రాయ్, పార్తిబన్,ప్రభు వంటి నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.