రాజమౌళి నుండి సినిమా వస్తుంది అంటే చాలు ఆడియన్స్ లో ఆ మూవీపై భారీగా అంచనాలు నెలకొని ఉంటాయి. ఇటీవల ప్రభాస్ తో ఆయన తీసిన బాహుబలి సినిమాల భారీ విజయాల తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు దక్కించుకున్న రాజమౌళి ప్రస్తుతమ్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తీస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా రౌద్రం రణం రుధిరం. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ కొమురం భీం గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా యాక్ట్ చేస్తున్నారు.

ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాని మొదట గత ఏడాది జులై 30న విడుదల చేద్దాం అని భావించారు. గ్రాఫిక్స్ వర్క్ లేట్ అవడం కారణంగా ఆ తరువాత దీనిని ఈ ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. మధ్యలో కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో మరొక్కసారి మూవీని అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి వస్తున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి విడుదల చేద్దాం అని భావించిన యూనిట్, ఆ టైంకి ఇప్పటికే పలు బడా సినిమాలు డేట్స్ అనౌన్స్ చేసి ఉండడంతో సమ్మర్ లో విడుదల చేద్దాం అనూకున్నారని, కాగా నిన్న సడన్ గా కెజిఎఫ్ చాప్టర్ 2 టీమ్ తమ మూవీని ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో కొంత ఆలోచనలో పడిందట ఆర్ఆర్ఆర్ టీమ్. ఇక చివరికి గత ఏడాది తాము మొదట ప్రకటించిన డేట్ అయిన జులై 30నే మూవీని వచ్చే ఏడాది రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసేందుకు వారు సిద్దమైనట్లు చెప్తున్నారు. అలానే ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు సమాచారం. మొత్తంగా అటు తిరిగి ఇటు తిరిగి ఆర్ఆర్ఆర్ టీమ్ ట్విస్ట్ ఇస్తూ మొదట ప్రకటించిన డేట్ అయిన జులై 30న వస్తారో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: