ఒకప్పుడు టీవీ సీరియల్స్ లో నటించిన రోహిణి ఆ తర్వాత బిగ్ బాస్ అనే కార్యక్రమం ద్వారా ఎంత గానో గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో అలరించింది.  బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోహిని దశ తిరిగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత జబర్దస్త్ కామెడీ షోలో ప్రత్యక్షం అయ్యింది.  జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ టీం తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ దగ్గర అయిపోయింది. అయితే కేవలం రాకింగ్ రాకేష్ టీం లో మాత్రమే కాకుండా మిగతా టీమ్ లో కూడా చేస్తూ అదిరిపోయే పెర్ఫార్మన్స్ చేసి అదరగోడుతుంది.



 ప్రతి ఒక్క నటికి సరైన సమయం వచ్చినప్పుడు తమలోని టాలెంట్ నిరూపించుకోవాలి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని కొన్ని సార్లు తమలో దాగివున్న టాలెంట్ పైకి చూపిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఇటీవల ఓ కర్తక్రమంలో  తన నట విశ్వరూపాన్ని చూపించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో వస్తుంది అనే విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎప్పుడూ వినూత్నమైన కాన్సెప్ట్ తో తెరమీదికి వస్తూ ప్రేక్షకులు
అలరిస్తూ ఉంటారు .


 ఇటీవలే విడుదలైన శ్రీదేవి తమ కంపెనీ ప్రోమోలో మొదట తనదైన శైలిలో సరదాగా కామెడీ పంచిన రోహిని ఆ తర్వాత మాత్రం ఒక అదిరిపోయే పర్ఫామెన్స్ చేసి అందరినీ ఆకట్టుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా ఉన్న విజయశాంతి ఒసేయ్ రాములమ్మ సినిమా ఓ సీన్ తీసుకొని  పర్ఫామెన్స్ చేసింది విజయశాంతి.  తన నటనతో ఆకట్టుకుంది. రామి రెడ్డి పాత్రలో  రాంప్రసాద్ చేస్తాడూ. రోహిణి అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అక్కడున్న వారందరినీ ఫిదా చేసింది. పెర్ఫార్మన్స్ తర్వాత మాట్లాడిన హైపర్ ఆది వెండి తెర లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు అయితే బుల్లితెర లేడీ సూపర్ స్టార్ రోహిణి అంటూ చెబుతాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: