మన సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు కొన్ని సెంటిమెంట్స్ ని ఫాలో అవుతూ ఉంటారు.ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలా మంది హీరోలు తమ సినిమాల్లో హీరోయిన్స్ ని రిపీట్ చేస్తూ ఉంటారు.అలా చేసినప్పుడు సినిమా సక్సెస్ సాధిస్తే మళ్ళీ మళ్ళీ ఆ హీరోయిన్స్ తో కలిసి నటించడానికి సిద్ధ పడుతుంటారు.ఇప్పుడు అక్కినేని యంగ్ హీరో కూడా ఓ హీరోయిన్ విషయంలో అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడు.నాగ చైతన్య, మిల్కీ బ్యూటీ తమన్నాకాంబో ఇప్పుడు మరోసారి రిపీట్ కానున్నట్లు తెలుస్తోంది.గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 100% లవ్,తడాఖా సినిమాలు వచ్చాయి.వీటిలో 100 % లవ్  బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

 ఇక తడాఖా మాత్రం ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.ఇప్పుడు మూడోసారి ఈ ఇద్దరి కాంబో రిపీట్ కానుందట. ఇటీవల అల్లరి నరేష్ ని 'నాంది' సినిమాతో ఓ సరికొత్త పాత్రలో చూపించి భారీ సక్సెస్ అందుకున్న దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్షన్లో నాగ చైతన్య ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ సినిమాలో చైతూ, తమన్నా భార్య ,భర్తలుగా కనిపిస్తారని సమాచారం.షైన్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.అయితే తమన్నా ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇక నాంది సినిమాతో ..

తొలి ప్రయత్నం లోనే డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు విజయ్ కనకమేడల.ఇక ఇప్పుడు ఏకంగా అక్కినేని హీరో నాగ చైతన్య తో సినిమా చేస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు మొదలయ్యాయి. ఇక ప్రస్తుతం నాగ చైతన్య థాంక్యూ, బంగార్రాజు సినిమా షూటింగ్స్ తో బిజీగా వున్నాడు.ఈ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయ్యాక విజయ్ కనకమేడల డైరెక్షన్లో నాగ చైతన్య నటించబోయే సినిమా షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమాతో ముచ్చటగా మూడో సారి కలిసి నటించనున్న చైతూ, తమన్నా ల జోడీ పై ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు.ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: