మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్యలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా తిరు కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి కొన్నాళ్ల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, అలానే ఫస్ట్ సాంగ్ ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు ఏర్పరిచాయి.
అయితే ఈ మూవీ తరువాత త్వరలో గాడ్ ఫాదర్ మూవీ చేయనున్నారు మెగాస్టార్. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి తెలుగు రిమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీ తరువాత మెహర్ రమేష్ తో భోళా శంకర్ సినిమా తో పాటు బాబీ దర్శకత్వంలో కూడా మరొక సినిమా చేయనున్నారు మెగాస్టార్. ఇటీవల చిరంజీవి బర్త్ డే రోజున ఈ సినిమాల అధికారిక ప్రకటన రావడం జరిగింది. మ్యాటర్ లోకి వెళితే, బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్ సంస్థలు నిర్మించనుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు.

ఈ సినిమాలో మెగాస్టార్ వాల్తేరు వీరయ్యగా పక్కాగా మాస్ రోల్ లో కనిపించనున్నారని, మంచి కమర్షియల్ అంశాలతో దర్శకుడు బాబీ దీనిని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా తీయనున్నారని టాక్. కాగా ఈ సినిమాలో వీరయ్య తో తలపడే ఆయన బావ పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించనున్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. గతంలో మెగాస్టార్ తో సైరా నరసింహారెడ్డిలో నటించిన విజయ్ సేతుపతికి ఈ మూవీ స్టోరీ ఎంతో నచ్చడంతో వెంటనే నటించడానికి ఒప్పుకున్నరని సమాచారం. మరి ఈ వార్త కనక నిజం అయితే మరొక్కసారి తెరపై మెగాస్టార్, మక్కల్ సెల్వన్ కాంబినేషన్ చూడవచ్చని అంటున్నాయి సినిమా వర్గాలు .....!!

మరింత సమాచారం తెలుసుకోండి: