గోపీచంద్ హీరోగా తమన్నా హీరోయిన్ గా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'సీటీమార్'.ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం. ఇప్పటికే ఈ సినిమా సంబంధించిన కొన్ని పోస్టర్లు మరియు టీజర్లు, పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి మంచి స్పందన కూడా లభించింది. హీరో గోపీచంద్ మరియు హీరోయిన్ తమన్నా ఇద్దరు ఈ సినిమాలో కబడ్డీ టీం కోచ్ లుగా కనిపించబోతున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో పలు మార్లు కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తోంది.

అయితే తాజాగా ఈ చిత్ర బృందం సినిమాను సెప్టెంబర్ 3వ తారీకున విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మరియు సినిమాను అనుకున్న తేదీకి థియేటర్లలోకి తీసుకురావడానికి చిత్రబృందం రేయింబవళ్ళు కష్టపడుతుంది. ఇలా  తాము కష్టపడుతున్న విధానాన్ని ఈ సినిమా దర్శకుడు సంపత్ నంది సోషల్ మీడియా వేదికగా జనాలతో పంచుకున్నారు. 'సీటి మార్' సినిమా విడుదల తేదీ దగ్గరకు వచ్చిన  కూడా ఇంకా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేయలేదు.అయితే ట్రైలర్ విడుదల చేయడానికి కావాల్సిన డిటిఎస్ మిక్స్ పనులు నిన్న అర్ధరాత్రి జరిగాయి. అయితే  డిటిఎస్ ఫైనల్ మిక్స్ చూసిన సంపత్ నంది ఒక్కసారిగా షాక్ అయ్యారట.

ఇంత గొప్ప డిటిఎస్ మిక్స్ ఈ ట్రైలర్ కు రావడం చాలా ఆనందంగా అనిపించింది అని, అర్ధరాత్రి నేను సర్ప్రైజ్ అయ్యాను అంటూ, ట్రైలర్ చూసి మీరు విజిల్స్ వేయడానికి రెడీగా ఉండండి అంటూ సంపత్ నంది తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు . ఈ పోస్టుకు 'సీటీ మార్' డిటిఎస్ మిక్సింగ్ జరుగుతున్న వీడియో ను జత చేశాడు .ప్రస్తుతం గోపీచంద్ 'సిటీ మార్' సినిమా తోపాటు మారుతి దర్శకత్వంలో రాశికన్నా హీరోయిన్ గా నటిస్తున్న 'పక్కా కమర్షియల్' అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: