చిరు, చరణ్ ఇద్దరూ కూడా ఈ సినిమాలో నక్సలైట్స్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తరువాత గాడ్ ఫాదర్ అనే మూవీ చేయనున్నారు మెగాస్టార్. మలయాళ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ తరువాత మెహర్ రమేష్ తో భోళా శంకర్, అలానే ఆపై బాబీ తో మరొక సినిమా కూడా చేయనున్నారు చిరంజీవి.
ఇక వీటిలో తమిళ్ మూవీ వేదాళం రీమేక్ గా భోళా శంకర్ తెరకెక్కనుండగా, బాబీ సినిమా మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇప్పటికే ఈ స్టోరీ కి సంబంధించి పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసిన దర్శకుడు బాబి, ప్రస్తుతం సినిమాలో నటించే ఇతర నటీనటుల ఎంపిక మొదలెట్టారని, అయితే ఈ మూవీలో ఒక కీలకమైన స్పెషల్ క్యారెక్టర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు అనేది లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల సమాచారం. సినిమాని కీలక మలుపు తిప్పే ఈ పాత్ర కి పవన్ అయితేనే కరెక్ట్ అని భావించారట యూనిట్. త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త లో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే మరికొద్దిరోజుల వరకు ఆగాల్సిందే. ఈ మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది....!!