అయితే ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదల అయిన ఈ సినిమా తెలుగు లో అంత భారీ విజయాన్ని అందుకోలేకపోయినప్పటికి అటు నార్త్ లో మాత్రం భారీ విజయం సాధించి అద్భుతంగా కలెక్షన్స్ అందుకుందట. భారీ యాక్షన్ సన్నివేశాలుతో కూడిన విజువల్ వండర్ గా సుజీత్ తీసిన ఈ సినిమాలో పాటలు బాగానే ఆకట్టుకోగా కథ, స్క్రీన్ ప్లే పరంగా అంత ఆసక్తికరంగా లేకపోవడంతో సినిమాని ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదట. అయితే ఆ తరువాత సుజీత్, మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయనున్నారు అంటూ కొన్ని నెలల క్రితం వార్తలు వినిపించినప్పటికి అది కార్యరూపం దాల్చలేదట. ఇదిలా ఉండగా లేటెస్ట్ ఫిలిం నగర్ న్యూస్ ప్రకారం ప్రభాస్ తోనే త్వరలో మరొకసారి సుజీత్ ఒక భారీ సినిమా చేయనున్నారని సమాచారం.
ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం.భారీ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీ కథపై ఇప్పటికే ప్రభాస్ పాజిటివ్ గా కామెంట్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సుజీత్ దీని పూర్తి స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది.త్వరలో అది ప్రభాస్ కి వినిపించిన తరువాత దీనికి సంబంధించి అధికారిక ప్రకటన బయటకు వస్తుందని అంటున్నారట. అయితే ఇటీవల రాధేశ్యామ్ షూట్ మొత్తం పూర్తి చేసాడట ప్రభాస్.ప్రస్తుతం ఆదిపురుష్ మరియు సలార్ అలాగే ప్రాజక్ట్ కె సినిమాలు చేస్తున్నారు.
మరోవైపు ఏ మాత్రం షెడ్యూల్స్ విరామం లేకుండా ఈ మూడు సినిమాల షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నారని సమాచారం.అయితే ఇవి పూర్తి అయిన తరువాతనే సుజిత్ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని వార్త వినిపిస్తుంది. ఒకవేళ సినిమా మొదలైతే సాహో తరహాలో ఆలస్యం కాకుండా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా సుజీత్ కి ప్రభాస్ గట్టిగా సూచన చేసారని సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్నాళ్లపాటు ఎదురుచూడక తప్పదని తెలుస్తుంది.