అందాల ముద్దుగుమ్మ త్రిష నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కింగ్, కృష్ణ, బుజ్జిగాడు, స్టాలిన్ ఇలా అనేక సినిమాలలో నటించి తెలుగు టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే టాలీవుడ్ లో ఇంతలా క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం మాత్రం తమిళ సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. ఇదిలా ఉంటే అమద్య ఈ ముద్దుగుమ్మ చిరంజీవి హీరోగా  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆచార్య' సినిమాలో హీరోయిన్ గా అవకాశం వస్తే ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు వార్తలు బయటకు వచ్చాయి. అయితే  తెలుగులో మరో సీనియర్ హీరో అయిన బాలకృష్ణ సినిమాకు మాత్రం ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అఖండ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు.

 ఈ సినిమా పూర్తవ్వగానే  'క్రాక్' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ సమర్పణలో ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా గోపిచంద్ మలినేని ఈ కథను రాసుకున్నాడట. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ కు జంటగా త్రిష నటిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దర్శకుడు గోపీచంద్ మలినేని త్రిషను సంప్రదించగా దానికి ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పినట్లు ఫిలిం సర్కిల్ లో ఓ న్యూస్ చక్కెర్లు కొడుతుంది.మరి ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్రబృందం అఫిషియల్ గా అనౌన్స్ చేయాల్సిందే. ఈ సినిమాను ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాగా తెరకెక్కిస్తునే మంచి యాక్షన్ సీన్స్ ఉండేలా దర్శకుడు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో గోపీచంద్ మలినేని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: