సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రాజకుమారుడు సినిమా తో మెరిసిన ఈ ముద్దుగుమ్మ , మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ప్రీతి జింటా మొదట 1996వ సంవత్సరంలో ఒక మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి , ఇక మొదట్లోనే పర్క్ చాక్లెట్ ప్రమోషన్ కోసం ప్రకటనలలో నటించింది. టెలివిజన్ పై మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రీతిజింటా, హిందీలో దర్శకుడు శేఖర్ రూపొందించిన" తారా రమ్ పం పం"హిందీలో హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం వచ్చినప్పటికీ , కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇక ఆ తర్వాత 1998వ సంవత్సరంలో దిల్ సే అనే చిత్రంలో కేవలం 20 నిమిషాల పాత్రను పోషించింది.

తర్వాత ఆమె నటించిన పలు సినిమాలు విజయవంతం కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుని , ఆ తరువాత తెలుగు, ఇంగ్లీష్ అలాగే పంజాబీ భాషలలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మహేష్ బాబు సరసన రాజకుమారుడు సినిమాలో నటించి, ఆ తర్వాత వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇక ఇంగ్లీషు సినిమాల్లో కూడా ఈమె నటించింది. ఎన్నో అవార్డు లతోపాటు బహుమతులు కూడా గెలుచుకోవడం గమనార్హం.

2004వ సంవత్సరంలో బిబిసి న్యూస్ ఆన్ లైన్ లో వ్యాఖ్యాతల బృందంలో చేరి, వివిధ సామాజిక అంశాలపై గొంతు విప్పి, కలం చేత పట్టింది. కోవిడ్ కారణంగా చాలా కాలం వరకు ఆమె ఫిట్నెస్ కు దూరంగా ఉండటంతో ,ఇటీవల తన ట్రైనర్ యాస్మిన్ కరాచీ వాలా అధ్వర్యంలో తిరిగి ఫిట్నెస్ లక్ష్యంగా ఆమె ఎక్సర్సైజులు చేయడం మొదలు పెట్టింది. అయితే ఈ రోజు మొదటి రోజు కావడంతో, ఆ వీడియో తీసి ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం తో ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారింది. ఇది చూసిన కొంతమంది అభిమానులు ఈమె మళ్లీ సినిమాల్లోకి రావడానికి రెడీ అవుతున్నట్లు ఉంది ..అంటూ కామెంట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: