అందాల ముద్దుగుమ్మ త్రిష తెలుగు లో వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బుజ్జిగాడు, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కింగ్ వంటి పలు చిత్రాల్లో నటించి టాలీవుడ్ టాప్ హీరోయిన్ స్థానంలో ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత కాలంలో కూడా తెలుగులో కొన్ని సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాత్రం తమిళ్ ఇండస్ట్రీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం త్రిష కోలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్' అనే చిత్రంలో  నటిస్తుంది. ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో ఐశ్వర్యరాయ్, విక్రమ్, కార్తి, జయరామ్, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరం ఏప్రిల్ కి విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు అడుగడుగునా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ లో గుర్రం చనిపోవడంతో దర్శకుడు మణిరత్నం పై పెటా సంస్థ కేసు పెట్టింది. ఇదిలా ఉంటే తాజాగా నటి త్రిషను అరెస్ట్ చేయాలి అంటూ హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అందుకు కారణం త్రిష దేవాలయంలో చెప్పులు వేసుకుని తిరగడమే. ప్రస్తుతం ఈ చిత్రం ఇండోర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఇందులో భాగంగా త్రిష కారు దిగి చెప్పులతో శివుడు, నంది విగ్రహాల మధ్య నడుచుకుంటూ వచ్చిన సన్నివేశాలను చిత్రీకరించారు. దీనితో హిందు సంఘం నేతలు త్రిషపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి పని చేసి హిందువుల మనోభావాలు దెబ్బ తీసినందుకు త్రిషపై కేసు నమోదు చేయాలి అని , త్రిషను వెంటనే అరెస్ట్ చేయాలని సంఘం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి ఈ విషయం ఎంత దూరం వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: