మంచి నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు గోపీచంద్ గత కొంతకాలంగా ఆయన నటించిన వరుస సినిమాలు పరాజయం పాలవుతున్నాయి. దీనితో గోపిచంద్ చాలా సతమతమవుతున్నారని సమాచారం.

ఆక్సిజన్ మరియు పంతం, చాణక్య వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాలుగా మారడంతో గోపీచంద్ మార్కెట్ బాగా పడిపోయిందని తెలుస్తుంది. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో "సీటీ మార్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తుంది. "గౌతమ్ నంద" సినిమా తరువాత గోపీచంద్ మరియు సంపత్ నంది కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా వీరిద్దరి కాంబినేషనులో రాబోయే రెండవ సినిమా అని తెలుస్తుంది. తమన్నా మరియు దిగంగన సూర్యవంశీ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం.

మరోవైపు మారుతి దర్శకత్వంలో "పక్కా కమర్షియల్" అనే సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట గోపీచంద్. అలాగే తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయని తెలుస్తుంది. నిజానికి గోపీచంద్ కి మంచి పేరు తీసుకొచ్చిన సినిమా "జయం". అందులో విలన్ పాత్రలో గోపిచంద్ అందరిని ఎంతగానో మెప్పించారని సమాచారం. ఆ సినిమాకి తేజ దర్శకత్వం వహించారని అందరికి తెలుసు.. అయితే తేజ దర్శకత్వంలో ఈసారి గోపీచంద్ హీరోగా కనిపించబోతున్నారని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారట.కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తేజతో సినిమా అనుకున్న మాట నిజమే కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదని తెలిపినట్లు సమాచారం.ప్రస్తుతం తనకు లౌక్యం వంటి మంచి విజయం ఇచ్చిన శ్రీవాస్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు  గోపీచంద్ తెలిపారని సమాచారండైరెక్టర్ శ్రీవాస్ తో ఇది వరికే తీసిన లక్ష్యం మరియు లౌక్యం సినిమాలు భారీ విజయం అందుకున్నాయి. అందుకే వీరి కాంబినేషనులో హ్యాట్రిక్ విజయం కోసం. చూస్తున్నట్లు సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: