వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ తాజాగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సీటీ మార్ చిత్రం తో సూపర్ హిట్ అందుకొని మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా కుటుంబ కథా ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది ఈ సినిమా. విడుదలైన తొలి రోజు నుంచి భారీ ఓపెనింగ్స్ ను సాధించుకుని హిట్ టాక్ దిశగా వెళుతున్న ఈ సినిమా రెండో రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లను సాధించుకుంది.

తమన్నా, సూర్య వంశీ దిగంగనా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం తరువాత గోపీచంద్ రెండు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్న గోపీచంద్ అదే సమయంలో శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు.  సీటీ మార్ విడుదల కాకముందే ఈ రెండు చిత్రాలను మొదలు పెట్టిన గోపీచంద్ ముందుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాని విడుదల చేయనున్నాడు.

ఇకపోతే శ్రీ వాస్ సినిమాకు సంబంధించి గోపీచంద్ సంగీత దర్శకుడు నీ ఎంపిక చేశారు. సీటీ మార్ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో మ్యూజికల్ హిట్ సినిమాలు రాగా ఇప్పుడు మరొకసారి వీరిద్దరి కాంబినేషన్ తెరపైకి వస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనేలా చేశాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా సంగీతపరంగా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఉందో చూడాలి. మణిశర్మ కూడా తన కం బ్యాక్ లో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాడని చెప్పాలి.. తమన్, దేవి శ్రీ ల పోటీ లో ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏమేరకు రానిస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: