మహేష్ బాబు తో టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసిన రెండు సినిమాలు ఫలితం తో సంబంధం లేకుండా ఆడియన్స్ లో వీరిద్దరి కాంబినేషన్ పై విపరీతమైన క్రేజ్ ని తెచ్చిపెట్టాయి అనే చెప్పాలి. ఫస్ట్ టైం వీరిద్దరూ కలిసి 2005 లో చేసిన సినిమా అతడు. శ్రీ జయభేరి ఆర్ట్స్ బ్యానర్ ఫై తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు.

తరువాత 2010లో మరొక్కసారి ఈ ద్వయం చేసిన మూవీ ఖలేజా. అనుష్క శెట్టి హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీని సింగనమల రమేష్, సి కళ్యాణ్ నిర్మించారు. అయితే ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయింది. ఇక ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే మాస్ యాక్షన్ మూవీ చేస్తోన్న మహేష్, ఆ తరువాత త్రివిక్రమ్ తో మరొక్కసారి పని చేయనున్నారు. చాలా గ్యాప్ తరువాత తమ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ కథ, కథనాల విషయమై త్రివిక్రమ్ ఎంతో పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి థమన్ సంగీత దర్శకుడు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమా భారీ యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లు చెప్తున్నారు.

అయితే ఈ సినిమా కోసం ప్రస్తుతం మేకర్స్ రెండు టైటిల్స్ ని అనుకుంటున్నారని, కాగా అవి పార్ధు, అతడే పార్ధు అని సమాచారం. యూనిట్ ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒకటి త్వరలో ఫైనల్ చేసి అధికారికంగా ప్రకటనించనుందని, సినిమా కథ ప్రకారం సరిపోయే టైటిల్ ని వారు ఫైనలైజ్ చేస్తారట. మరి నిజంగానే మహేష్, త్రివిక్రమ్ ల మూవీకి ఈ రెండు టైటిల్స్ ఏదో ఒకటి ఫిక్స్ అవుతుందో లేదో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: