నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమా చివరిదశ షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు. చాలా రోజుల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా బాలకృష్ణ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో తనకు రెండు భారీ హిట్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీను తో కలిసి ఈ సినిమాను చేస్తున్నాడు.

ఆ అంచనాలకు తగ్గట్లుగా బాలకృష్ణ ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించాడని చెప్పవచ్చు. రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న బాలకృష్ణ వాటికి సంబంధించిన టీజర్ లను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని కలిగేలా చేశాడు. ఇక పోతే ఈ సినిమా తరువాత క్రాక్ సినిమా తో హిట్ సంపాదించిన దర్శకుడు గోపీచంద్ మలినేని తో మాస్ మసాలా సినిమా చేయబోతున్నాడు బాలకృష్ణ. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుందని తెలుస్తుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పలనాడు చెందిన ఒక చరిత్రకారుడి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా మరొకటి పవర్ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు తాజాగా ఓ వార్త సోషల్ మీడియా లో తెగ ప్రచారం అవుతుంది. రౌడీయిజం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని అంటున్నారు. ఇందులో ఒక హీరోయిన్ గా త్రిష నీ ఎంపిక చేయగా మరో హీరోయిన్ గా శ్రుతిహాసన్ అనుకుంటున్నారు. మరీ బాలకృష్ణ రౌడీయిజం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: