‘సైజ్ జీరో’ మూవీ తరువాత విపరీతంగా బరువు పెరిగిన అనుష్క తన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవడానికి యోగ ధ్యానంతో పాటు విదేశాలకు వెళ్ళి వెయిట్ లాస్ థెరపీ చేసింది. అయినా ఇప్పటికీ ఆమెను ఆ బరువు సమస్యలు వేదిస్తూనే ఉండటంతో సినిమాలను బాగా తగ్గించి వేసింది. దీనితో టాప్ హీరోలు కూడ ఇంచుమించు ఆమెను మరిచిపోయారు.


అదేవిధంగా ఇప్పుడు ఆమె ప్రియ స్నేహితుడు ప్రభాస్ కు కూడ అదే సమస్యలు వెంటాడుతూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సలార్ ఆదిపురుష్ సినిమాల షూటింగ్ లను పరుగులు తీయిస్తున్న ప్రభాస్ కు ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓమ్ రౌత్ చెప్పిన సలహాను కాదనలేని పరిస్థితి అని అంటున్నారు.


ఈమధ్య ప్రభాస్ ‘ఆదిపురుష్’ షూటింగ్ కోసం ముంబాయి ఎయిర్ పోర్ట్ నుండి తన హోటల్ కు వెళుతున్నప్పుడు మేకప్ లేకుండా ఉన్న అతడి లుక్ కు సంబంధించిన ఫోటోలు ఉత్తరాదిన సోషల్ మీడియాలో చాల వైరల్ అయ్యాయి. దీనితో ప్రభాస్ మొఖంలో గ్లో తగ్గింది ఏమిటి అంటూ బాలీవుడ్ మీడియా కథనాలు వ్రాసింది. ఇప్పుడు ఈవిషయం అంతా ఓమ్ రౌత్ దృష్టి వరకు రావడంతో అతడు వెంటనే ఎలర్ట్ కావడమే కాకుండా శ్రీరాముడుని ఇలా ప్రభాస్ లుక్ లో చూస్తే ప్రేక్షకులు అంగీకరించరు అన్న భయం పట్టుకున్నట్లు ఉంది.


దీనితో ఓమ్ రౌత్ ప్రభాస్ ను లండన్ లోని ఒక ప్రముఖ వెయిట్ లాస్ క్లినిక్ కు పంపించి అక్కడ వెయిట్ లాస్ థెరపీ చేయించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ కు సంబంధించిన ఒక భారీ యాక్షన్ సీన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈమూవీ షూట్ మరొక 10 రోజులు ఉంటుంది అని టాక్. ఈ షెడ్యూల్ పూర్తికాగానే ప్రభాస్ తన వెయిట్ లాస్ థెరపీ కోసం లండన్ వెళతాడు అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది..




మరింత సమాచారం తెలుసుకోండి: