సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండేవారి పేర్లు ఒకసారి చూస్తే అందులో టాలీవుడ్ హీరోయిన్ గా సినిమా కెరీర్ ప్రారంభించి బాలీవుడ్ లో వెళ్లి స్థిరపడిన తాప్సి ఖచ్చితంగా ఉంటుంది. ఒక సినిమాను సరిగా పబ్లిసిటీ చేయడంలో సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తుంది.అందుకే సినిమా సెలెబ్రిటీలు అంతా ఖాళీ సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో వాలిపోతూ ఉంటారు. గంటలు గంటలు అభిమానవులతో చిట్ చాట్ లు చేయడం. వీడియో కాల్స్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఇవన్నీ కూడా వారిని అభిమానులు మరిచిపోకుండా ఉండడానికి చేసే ట్రిక్స్. దానికి తోడు అభిమానాలు సైతం ఎప్పుడెప్పుడు మా అభిమాన నటీనటులు సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారా, షేర్ చేద్దామా అని రెడీగా ఉంటారు. ఏదైనా ఫోటో, వీడియో పోస్ట్ అయిందంటే చాలు... గంటల్లో లక్షల లైక్స్, షేర్స్ వచ్చేస్తాయి.

దేశ రాజధాని ఢిల్లీకి చెందిన తాప్సి ముందుగా మోడలింగ్ చేస్తూ ఉండేది. అలా రాఘవేంద్రరావు దర్శకత్వ వహించిన "ఝుమ్మంది నాదం" సినిమాతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఈ సినిమా 2010 లో విడుదలై పెద్దగా కమర్షియల్ హిట్ కాకపోయినా సినిమా బాగుంది అనే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాతా కొన్ని సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో నిలదొక్కుకోలేకపోయింది. అలా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తాప్సి వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

తాప్సి పొన్ను ఎక్కువగా ట్విట్టర్ అండ్ ఇంస్టాగ్రామ్ ను ఫాలో అవుతూ ఉంటుంది. అపుడప్పుడు సమాజములో ఉండే ప్రస్తుత సమస్యల గురించి కూడా సమాజాన్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. లింగభేదం గురించి అందరికీ అవగాహన కల్పిస్తూ ఉంటుంది. మహిళలపై జరిగే అరాచకాలపై ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటుంది. గత నెలలో జరిగిన ఒలింపిక్ గేమ్స్ లో మన దేశానికి వచ్చిన పథకాల పట్ల ఎంతో సంతోషంగా అభిమానులతో పంచుకుంది. ఈమెకు దేశ భక్తి చాలా ఎక్కువని తెలుస్తోంది. ట్విట్టర్ లో ఈమెను ఫాలో అవుతున్న వారు 4.7 మిలియన్ మంది ఫాలోయర్స్ మరియు ఇంస్టాగ్రామ్ లో 19 మిలియన్ మంది ఫాలోయర్స్ తో తన హవా చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: