హ్యాండ్సమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. తొలిసారిగా మహేష్ తో పరశురామ్ తీస్తున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి. కీర్తి సురేష్ మహేష్ కి జోడీగా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ బ్లాస్టర్ టీజర్ సూపర్ రెస్పాన్స్ దక్కించుకుని అందరి నుండి సూపర్ రెస్పాన్స్ అందుకుంది.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్ యాక్టర్ సముద్రఖని విలన్ గా యాక్ట్ చేస్తుండగా జగపతి బాబు ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇక మధ్యలో పలు రకాల యాడ్స్ తో పాటు తనవంతుగా ఇతర సినిమాల టీజర్స్, ట్రైలర్స్ వంటివి విడుదల చేస్తూ వారికి తనవంతుగా తోడ్పాటునందిస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, త్వరలో తన మేనల్లుడు గల్లా గౌతమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారని లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల టాక్.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ డెబ్యూ మూవీ గా తెరకెక్కుతున్న హీరో మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకోగా దీనిని త్వరలో విడుదల చేసేందుకు సిద్ధం అవుతోందట యూనిట్. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మంచి స్పందన అందుకుంది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వచ్చే నెలలో ఎంతో వైభవంగా నిర్వహించనున్న యూనిట్, సూపర్ స్టార్ మహేష్ ని స్పెషల్ గెస్ట్ గా అహ్వాహిస్తోందట. ఇక తన మేనల్లుడి కోసం సూపర్ స్టార్ కూడా ఆ వేడుకకి తరలి వెళ్లనున్నారని అంటున్నారు. మరి ఈ వార్త కనుక నిజం అయితే అశోక్ నటిస్తున్న హీరో మూవీకి కొంత మేర మంచి హైప్ వచ్చినట్లే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: