మెగా స్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న సినిమాలలో ఒకటి గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సినిమా లూసిఫర్ కి రీమేక్ గా తెరకెక్కితున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ఇటీవలే అట్టహాసంగా మొదలైంది. మెగా స్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. త్రిష కానీ ఇలియానా కానీ అనుకుంటున్నారు. నయనతార మాత్రం ఓ కీలక పాత్ర లో నటిస్తుంది.

ఇకపోతే ఈ సినిమా విలన్ పాత్ర లో సత్యదేవ్ నటిస్తుండగా ఓ ముఖ్య పాత్ర లో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడని మాత్రం తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా మొదలుపెట్టుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడిందో అందరికి తెలిసిందే. మొదట ఈ చిత్రానికి సుజిత్ దర్శకుడు అనుకున్నారు.. అయితే అయన తన స్క్రిప్ట్ తో చిరు ను ఏమాత్రం మెప్పించలేకపోయారు. దాంతో ఆయనను పక్కన పెట్టి వినాయక్ కు ఈ సినిమా బాధ్యతలు అప్పగించగా అయన కూడా చిరు మెప్పించడం లో విఫలం అయ్యారు.

దాంతో చివరికి మోహన్ రాజా కి ఈ సినిమా బాధ్యతలు అప్పగించగా అయన చిరు వందకు వందశాతం కాకపోయినా బాగానే మెప్పించారట. అయితే షూటింగ్ వెళ్లే సరికి ఏవైనా లోపాలు ఉంటే సరిచేస్తారని భావించిన చిరు ఇప్పుడు అయన పనితనం పట్ల కూడా సంతృప్తిగా లేరని తెలుస్తుంది. దాంతో ఈ సినిమా కి మళ్ళీ రిపేర్ లు చేయడం మొదలుపెట్టారు. దాంతో కథ మళ్ళీ మొదటికొచ్చినట్లయ్యింది.. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ఇలా అవడం మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. మరోవైపు చిరు తర్వాత చేయబోయే చిత్రాలు షూటింగ్ కు వెళ్ళడానికి రెడీ గా ఉన్నాయి.. ఈ నేపథ్యంలో చిరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: