మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రాన్ని తొందరగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఆ తర్వాత తన తదుపరి చిత్రాల కు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు మహేష్.

డిసెంబర్ నెలలో ఈ సినిమా కు సంబంధించిన పనులు పూర్తి అవగానే ఈ సినిమాను విడుదల చేసే ఆలోచన చేస్తుండగా దానికి ముందే మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టే విధంగా ప్రణాళికలు వేసుకున్నాడు. నవంబర్ నెలలోనే ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను మొదలు పెట్టలని చూస్తున్నాడు. అంతే కాదు ఆ తర్వాత కొంత సమయం వ్యవధిలోనే రాజమౌళి సినిమాను కూడా మొదలు పెట్టాలని మహేష్ బాబు చూస్తున్నాడు.

ఈ నేపథ్యంలో మరో సినిమాను కూడా ఓకే చేసుకునే విధంగా మహేష్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఉప్పెన సినిమాతో భారీ హిట్ ను అందుకున్న బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయాలని భావించి ఓ కథను రెడీ చేయమన్నాడట. బుచ్చిబాబు కూడా ఎంతో సంతోషంతో ఆయన కోసం ఓ పవర్ ఫుల్ కథను సిద్ధం చేసి మహేష్ కు చెప్పాడట. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఈ చిత్రాన్ని నచ్చిన విధంగానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కుప్పం ఇలాంటి చిన్న సినిమాలు చేసిన తర్వాత మహేష్ లాంటి స్టార్ హీరో భారీ బడ్జెట్ సినిమాను మన బుచ్చిబాబు  హ్యాండిల్ చేస్తాడా చూడాలి. ఉప్పెన తో ఏ డెబ్యు డైరెక్టర్ అందుకొని విధంగా సూపర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు కి మంచి అభిమానం అయితే ఏర్పడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: