మొత్తానికి చాలా రోజుల విరామం తరువాత ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట షూటింగ్ వేగవంతంగా జరుగుతోంది. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో ప్రారంభం అయింది. ఆ తరువాత హైదరాబాద్, గోవా లలో తదుపరి షెడ్యూల్స్ నిర్వహించిన యూనిట్, ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ, ట్రైడెంట్ హోటల్ వంటి ప్రాంతాల్లో లేటెస్ట్ షెడ్యూల్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీని తరువాత నెక్స్ట్ షెడ్యూల్ ని స్పెయిన్ లో జరుపనున్నట్లు టాక్.

కీర్తి సురేష్ ఫస్ట్ టైం సూపర్ స్టార్ మహేష్ కి జోడీగా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తుండగా తమిళ నటుడు సముద్రఖని ఈ మూవీలో విలన్ గా కనిపించనున్నట్లు టాక్. బ్యాంకింగ్ రంగాన్ని ఇటీవల కుదిపేసిన పలు ఆర్ధిక నేరాలని బేస్ చేసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా యాక్షన్ తో కూడిన మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు పరశురామ్ ఈమూవీని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా తీస్తున్నట్లు ఇన్నర్ వర్గాల సమాచారం.

ఇక ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్, మోషన్ పోస్టర్ అన్ని కూడా ఫ్యాన్స్ నుండి మంచి స్పందన అందుకున్నాయి. మరొకవైపు మహేష్ ఫ్యాన్స్ ఈ మూవీ ఫస్ట్ సాంగ్ కోసం ఎదురుచూస్తుండగా లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ సరిగ్గా దసరా పండుగ రోజున విడుదల చేసేందుకు సర్కారు వారి పాట యూనిట్ సన్నాహాలు చేస్తోందట. ఇక త్వరలో ఈ విషయమై యూనిట్ నుండి అఫీషియల్ గా ప్రకటన కూడా రానుందట. కాగా ఈ సినిమాని పొంగల్ కానుకగా 2022 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా ఎంతో భారీ లెవెల్లో థియేటర్స్ లో విడుదల చేయనున్నారు మేకర్స్.




మరింత సమాచారం తెలుసుకోండి: