సూపర్ స్టార్ మహేష్ తో త్వరలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీయనున్న భారీ ప్రతిష్టాత్మక సినిమాపై సూపర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. మొదటగా మహేష్ తో త్రివిక్రమ్ తీసిన అతడు మూవీ ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించగా మణిశర్మ దీనికి సంగీతం అందించారు.

ఆ తరువాత మరొక్కసారి 2010లో వీరిద్దరూ కలిసి చేసిన ఖలేజా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ప్రస్తుతం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీ చేస్తోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, దాని తరువాత మరొక్కసారి పదకొండేళ్ల విరామం అనంతరం త్రివిక్రమ్ తో పని చేయనున్నారు.

హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించనుండగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఇందులో మెయిన్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. భారీ స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలానే మహేష్ ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఎంతో అద్భుతంగా ఈ సినిమా యొక్క స్క్రిప్ట్ ని ఇప్పటికే సిద్ధం చేశారట త్రివిక్రమ్ శ్రీనివాస్.

అయితే విషయం ఏమిటంటే, ఈ సినిమాలో మరొక హీరోయిన్ పాత్ర కూడా ఉందని, కాగా ఆ పాత్రకి గాను యువ భామ నభ నటేష్ నటించనుంది అంటూ కొద్దిరోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. అయితే లేటెస్ట్ ఫిలిం నగర్ వర్గాల న్యూస్ ప్రకారం ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర ఉన్న మాట నిజమే అని, అయితే ఆ పాత్రకి గాను యూనిట్ సభ్యులు రాశి ఖన్నాని ఎంపిక చేసారని అంటున్నారు. కాగా దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా త్వరలో రానుందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఏది నిజమో తెలియాలి అంటే యూనిట్ పక్కాగా స్పందించే వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: