తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ నటీమణిగా మంచి పేరు అందుకున్న వారిలో అనుష్క శెట్టి కూడా ఒకరు అని చెప్పకతప్పదు. సూపర్ మూవీ ద్వారా టాలీవుడ్ కి కథానాయికగా రంగప్రవేశం చేసిన అనుష్క, ఆ సినిమాలో షాషా అనే పాత్రలో కనిపించారు. ఆ తరువాత ఒక్కొక్కటిగా ఛాన్స్ లు అందుకుంటూ కొనసాగిన అనుష్కకి ఆపైన కోడిరామకృష్ణ తీసిన లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ అరుంధతి సూపర్ డూపర్ హిట్ కొట్టి నటిగా ఆమెకు విపరీతంగా క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఆ తరువాత నుండి హీరోయిన్ గా మరిన్ని అవకాశాలతో కొనసాగిన అనుష్క శెట్టి, తెలుగు తో పాటు అటు తమిళ లో కూడా పలు సినిమాలు చేసారు. ఇక మధ్యలో అక్కడక్కడా పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసిన అనుష్క కి రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ఆ తరువాత ఆమె భాగమతి, అలానే నిశ్శబ్దం వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పేరు అందుకున్నారు. ఇక కొన్నాళ్లుగా అనుష్క నుండి ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఆమె ఫ్యాన్స్ ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

అయితే నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి లతో కలిసి మిస్టర్ అండ్ మిస్ శెట్టి అనే సినిమాని యువ దర్శకుడు ఒకరు యువి క్రియేషన్స్ బ్యానర్ పై త్వరలో తీయనున్నారని కొన్నాళ్ల క్రితం పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు రావడం జరిగింది. అయితే దాని పై ఇప్పటివరకు ఎక్కడా కూడా అఫీషియల్ గా ప్రకటన రాకపోవడంతో అనుష్క ఫ్యాన్స్ కొంత అయోమయంగా ఉన్నారని సమాచారం. అసలు మా హీరోయిన్ నుండి ఎప్పుడు సినిమా వస్తుందో ఏమో అంటూ పలువురు ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇకనైనా అనుష్క, తన ఫ్యాన్స్ ఆవేదనని పట్టించుకుని తదుపరి సినిమాల గురించిన విషయాలు వెల్లడిస్తారో లేదో చూడాలని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: