మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు నేనేం తక్కువ కాదు అంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రం లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను చిత్రం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవిసినిమా తో పాటు మలయాళం లో సూపర్ హిట్ గా  నిలిచిన 'లూసిఫర్' సినిమా  కు రీమేక్ గా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇలా ఈ రెండు రెండు సినిమాల షూటింగ్ ను చకచకా పూర్తి చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి 'వేదాళం' సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న 'బోలా శంకర్' సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కూడా త్వరలో ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన ఒక ప్రోమో కూడా చిత్ర బృందం విడుదల చేసింది. దీనికి జనాల నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కి జంటగా తమన్నా ను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కథను తమన్నాకు వినిపించగా ఓకే చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తమన్నా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సరసన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో మరోసారి మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా కనిపించబోతున్నట్లు ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: