టాలీవుడ్‌లో సూపర్ కపుల్ అయిన సమంత మరియు నాగచైతన్య అక్కినేని దంపతులు విడిపోతున్నారనే వార్తలు మీడియాలో అంతకంతకు పెరుగుతున్నాయి.

అయితే మీడియాలో వైరల్‌గా మారుతున్న వార్తలను పట్టించుకోకుండా అక్కినేని ఫ్యామిలీ తమ  పార్టీలు మరియు సెలబ్రేషన్స్‌లో బిజీగా కనిపిస్తున్నారని సమాచారం. భర్త నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నారనే వార్తల మధ్య ఆమె అక్కినేని ఫ్యామిలీకి దూరమవుతున్నారనే వార్తకు బలం చేకూరేలా ఓ ఫోటో మీడియాలో వైరల్ అయిందని సమాచారం. ఆ ఫోటో వెనక కథ ఏమిటో తెలుసా..

సమంతకు విడాకులు ఇస్తున్నారనే విషయం పక్కన పెడితే లవ్ స్టోరి ప్రమోషన్స్‌లో నాగచైతన్య కూల్‌గా కనిపించారని తెలుస్తుంది. ఏమాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా తన పని తాను చూసుకొంటూ వెళ్లిపోతున్నారని సమాచారం.తన కెరీర్‌లో అత్యంత కీలకంగా మారిన లవ్ స్టోరి సినిమా ప్రమోషన్స్‌పై చైతూ చాలా ఉత్సాహంగా కనిపించారని తెలుస్తుంది. సమంత వివాదం విషయంలో మీడియాకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా సక్సెస్‌పుల్‌గా ప్రమోషన్స్ పూర్తి చేసారని తెలుస్తుంది.

లవ్ స్టోరి చిత్రంలో నటిస్తున్న సమయంలోనే చైతూ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారని అందరికి తెలిసిన విషయమే. అమీర్ ఖాన్ స్వయంగా పిలిచి ఆయన నటించి నిర్మిస్తున్న లాల్ సింగ్ చద్దా మూవీలో ముఖ్య పాత్రను చైతుకు ఇచ్చారని సమాచారం. దాంతో అమీర్, చైతూ మధ్య బలమైన అనుబంధం ఏర్పడిందని తెలుస్తోంది. దాంతో లవ్ స్టోరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్వయంగా వస్తానని చెప్పడంతో ఆ వేడుకలో అమీర్ ఖాన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారని సమాచారం.

ఇక తన కుమారుడు అయిన చైతూ లవ్ స్టోరి రిలీజ్ రోజు నాగార్జునకు ప్రత్యేకంగా మారిందని తెలుస్తుంది. సెప్టెంబర్ 24వ తేదీన తన తండ్రి అయిన స్వర్గీయ నాగేశ్వరరావు అక్కినేని నటించిన ప్రేమ నగర్ చిత్రం విడుదల అయి 50 ఏళ్లు అవుతున్నట్లు సమాచారం.ఈ సందర్భంగా తన తండ్రి స్మారకంగా ఆ రోజును తలుచుకొని నాగార్జున ఎమోషనల్ అయ్యారని తెలుస్తుంది. ప్రేమనగర్ విడుదల రోజునే లవ్ స్టోరి విడుదల కావడం అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకంగా మారినట్లు తెలుస్తుంది.ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని నాగార్జున అమీర్ ఖాన్‌ను తన ఇంటికి ఆహ్వానించి ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారని తెలుస్తుంది.

ఇక లవ్ స్టోరి ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అమీర్ ఖాన్‌కు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గ్రాండ్ పార్టీని అరెంజ్ చేశారని సమాచారం. ఈ పార్టీకి లవ్ స్టోరి సినిమా యూనిట్‌‌లోని సాయి పల్లవి మరియు శేఖర్ కమ్ముల తదితరులు హాజరయ్యారని తెలుస్తుంది.ఈ పార్టీలో అఖిల్‌తోపాటు అక్కినేని కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారని సమాచారం. అయితే ఈ పార్టీలో ఎక్కడా సమంత కనిపించకపోవడంతో ఊహాగానాలు రెట్టింపు అయ్యాయని తెలుస్తుంది. అక్కినేని కుటుంబంతో ఉన్న విభేదాల కారణంగానే ఆ పార్టీకి సమంత దూరమైందనే వార్తలు మరోసారి ఊపందుకున్నాయని తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే.. నాగచైతన్య కెరీర్ పరంగా గ్రాండ్‌గా ప్లాన్ చేసుకొంటున్నట్టు కనిపిస్తున్నారని సమాచారం. తన తండ్రితో కలిసి బంగార్రాజు చిత్రంలో బాలరాజు అనే పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. తన తాత 70 ఏళ్ల క్రితం నటించిన బాలరాజు అనే చిత్రంలోని పాత్ర పేరుతో చైతూ కనిపించనున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: