టాలీవుడ్ లో దసరా సీజన్ అతి తక్కువ రోజులలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండడంతో ఆ సీజన్ ను ఉపయోగించుకోవాలని చాలామంది నిర్మాతలు ఇప్పటికే కొన్ని ప్రణాళికలు వేసుకున్నారు.  తమ సినిమాలను విడుదల చేసే విధంగా వారు ప్లాన్ చేసుకున్నారు.  ఈ నేపథ్యంలోనే దాదాపు ఏడు సినిమాల దాకా ఈ దసరా సీజన్ సినిమాలతో నిండిపోతుంది అని చెబుతున్నారు. వీటిలో చిన్న సినిమాలతో పాటు మంచి క్రేజీ సినిమాలు కూడా ఉండటం విశేషం.

ఇప్పటికే అక్టోబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సాయిధరమ్ తేజ్ అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోగా ఈ సినిమాల తర్వాత మరొక ఈ వారంలోనే రెండు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అక్టోబర్ 8వ తేదీన వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమా కొండ పొలం విడుదల చేస్తున్నాడు. ఇక ఆ రోజునే ప్రేక్షకుల ముందుకు రావాలని విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా భావిస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన పుష్పకవిమానం సినిమా విడుదల కు రెడీగా ఉన్న విషయం తెలిసిందే. 

ఇక దిల్ రాజు తన రౌడీ బాయ్స్ చిత్రం అక్టోబర్ 15న విడుదల చేయాలని భావిస్తున్నాడు. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మరియు మహాసముద్రం సినిమాలు కూడా అదే రోజున విడుదలకు ఉన్నాయని తెలుస్తుంది. నాగ శౌర్య వరుడు కావలెను సినిమా అదే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా దసరాకు వారం ముందు దాదాపు ఏడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇవే కాదు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన పెళ్లిసందడి అలాగే మారుతి మంచిరోజులు వచ్చాయి సినిమాలు కూడా దసరా నే టార్గెట్ చేశాయి.  మరి ఇన్ని మంచి క్రేజ్ మంచి పాపులారిటీ ఉన్న నటులు ఉన్న సినిమాలు ఒకేసారి వస్తున్న నేపథ్యంలో ఈ దసరా సీజన్ ఏ సినిమాకు బాగా కలిసి వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: