వయసు పెరిగినా.. తరగని అందం ఖుష్బూది. స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా నటించింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఫైర్ బ్రాండ్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. టాలీవుడ్ లో కలియుగ పాండవులు అనే మూవీలో వెంకటేశ్ సరసన వెండితెరపై మెరిసింది. తెలుగులోనే కాదు..తమిళ చిత్రాల్లోనూ తన ప్రతిభను కనుబరిచింది. చిరంజీవి, నాగార్జున లాంటి ప్రముఖ హీరోలతో నటించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. దాదాపు 9సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి చిత్రంతో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఖష్బూ తెలుగులో నటించింది చాలా తక్కువే. కానీ మంచి పేరు సంపాదించుకుంది. కోలీవుడ్ లో ఆమెకు అభిమానులు అపారంగా ఉన్నారు. ఖుష్బూకు ఏకంగా గుడికట్టారంటే అర్థం చేసుకోవచ్చు.. ఆమెపై ఎంత అభిమానం ఉందో.

ఇటీవల విపరీతంగా లావు అయిన ఖుష్బూ.. సన్నబడేందుకు చాలా కష్టపడింది. యోగా, వ్యాయామం చేస్తూ కరెక్ట్ డైట్ మెయింటైన్ చేసింది. కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. నాజూగ్గా.. టీనేజ్ అమ్మాయిలా మారిపోయింది. కుర్రహీరోయిన్ లు కుళ్లుకునేలా తయారైంది. ఎవరూ ఊహించని విధంగా తయారైన ఖుష్బూను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

ఖుష్బూ హేతువాది.. సమాజం పట్ల అవగాహన ఎక్కువ. ముస్లిం ఫ్యామిలీలో పుట్టి సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఖుష్బూ.. మహారాష్ట్రలోని ముంబై, పశ్చిమ అంధేరీలో 1970 సెప్టెంబరు 29న జన్మించారు. ఆమె భర్త సుందర్ కాగా.. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. వారి పేర్లు అవంతిక, ఆనందిత. ఖుష్బూ ఓ వైపు సినిమాల్లో నటిస్తూ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. భారతీయ జనతా పార్టీలో క్రియాశీల పాత్ర వహిస్తున్నారు. 

మొత్తానికి ఖుష్బూ 51ఏళ్ల వయసు వచ్చినా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. తన అందం ఇంకా తరగలేదు అని నిరూపించుకుంటూ ఫోటో షూట్ లు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: