మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకులు మరియు మహేష్ అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు.
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
సినిమా ఇటీవలే టీజర్ ను విడుదల చేసుకోగా
సినిమా పై అంచనాలను భారీ గా పెంచింది ఈ సినిమా. ఇక మహేష్ బాబు విషయంలో ఆయన అభిమానులు ఎంత క్లారిటీగా ఉంటారో ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తే మనకు అర్థమవుతుంది.
మహేష్ బాబు సెంటిమెంట్ ల ను బాగానే ఫాలో అవుతాడు అన్న విషయం తెలిసిందే. ఆయన లాగే ఆయన సినిమాల విషయంలో ఆయన అభిమానులు కూడా అదే విధమైన సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో
సినిమా విషయం లో సెంటిమెంట్ ను వెతికే పనిలో పడ్డారు అభిమానులు. అయితే మహేష్ బాబు ఫస్ట్ టైం పని చేసిన సమయంలో చాలా మంది డైరెక్టర్లు
బ్లాక్ బస్టర్ లు హిట్లు ఆయనకు అందించారు.
కృష్ణవంశీ మురారి తో,
గుణశేఖర్ ఒక్కడు తో,
త్రివిక్రమ్ అతడు తో,
పూరి జగన్నాథ్
పోకిరి తో, శ్రీను వైట్లతో దూకుడు తో,
శ్రీకాంత్ అడ్డాల సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు తో,
కొరటాల శివ శ్రీమంతుడు తో,
వంశీ పైడిపల్లి మహర్షి తో,
అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు
సినిమా తో సూపర్ హిట్ అందించారు. అలా మహేష్ బాబు తొలి సారిగా సినిమా చేయడమే కాకుండా ఆయనకు సూపర్ డూపర్ హిట్స్ ను అందించారు. ఇప్పుడు కూడా సర్కార్ వారి పాట సినిమాకు దర్శకత్వం వహిస్తున్న పరాషురామ్ మహేష్ తో తొలి
సినిమా చేస్తున్నాడు. దాంతో ఈ
సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని చెబుతున్నారు
ప్రిన్స్ ఫ్యాన్స్.
అయితే గతంలో కొంతమంది దర్శకులతో మొదటి సారి చేసినా కూడా ఫ్లాప్ లు వచ్చాయి. సురేందర్ రెడ్డితో కలిసి తీసిన అతిధి,
మురుగదాస్ స్పైడర్ వంటి సినిమాలతో మహేష్ బాబు హిట్ సాధించ లేక పోయాడు. దాంతో 80శాతం మంది దర్శకులులతో
సక్సెస్ సాధించడంతో ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ
సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.