మొదటిసారి నాటక రచయిత బీ వీ కరాంత్ రూపొందించిన బెనకా నాటక బృందం లో చేరాడు. నటన నేర్చుకొని మొదటిసారి ఈటీవీ కన్నడ లో ప్రసారం అయిన నందగోకులం టీవీ సీరియల్ ద్వారా మొదటిసారి బుల్లితెరపై అడుగులు వేశాడు.. తర్వాత నాలుగు సంవత్సరాల పాటు టెలీ సీరియల్స్ లో పనిచేసి, ఆ తర్వాత 2008లో శశాంక్ దర్శకత్వం వహించిన ముగ్గిన మనసు అనే సినిమాలో సహాయక పాత్రలో నటించాడు. అయితే అంతకు ముందు జంబడ హుడిగి అనే పాత్రలో నటించినప్పటికీ , పెద్దగా గుర్తింపు లేదు. తదుపరి చిత్రం 2008లో వచ్చిన రాఖీ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి హీరో గా అడుగు పెట్టాడు..
ఈ సినిమాతో గుర్తింపు పొందడంతో ప్రస్తుతం ఆయనను అందరూ రాఖీ అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. ఇక 2014 లో వచ్చిన గూగ్లీ సినిమాతో ఉత్తమ నటుడిగా కన్నడ ఫిలిం ఫేర్ అవార్డు తోపాటు సైమా అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యష్ , 2019లో కే జి ఎఫ్ చాప్టర్ వన్ సినిమాలో నటించి ఉత్తమ నటుడిగా రెండు సైమా అవార్డులతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కే జి ఎఫ్ టు సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు..అతి తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటులలో ఒకరిగా గుర్తింపు పొందడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడు గా మారిపోయాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.