టాలీవుడ్ సినిమాలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి పెట్టుకోవాలి అనే సామెత చాలా మంది పాటిస్తూ ఇప్పటి వరకు మంచి మంచి అవకాశాలను భారీ పారితోషికాలు తీసుకుని తమ జీవితాల్లో సెటిల్ అయిపోయారు. ముఖ్యంగా హీరోయిన్లు ఈ విషయం లో రాటుదేలిపోయారు అని చెప్పొచ్చు. వారి కెరీర్ చాలా తక్కువ టైం ఉంటుంది. కాబట్టి వారు ఇండస్ట్రీ కి వచ్చిన నాటి నుంచే భారీగా వసూలు చేసుకుని పారితోషికం తీసుకుంటూ ఉంటారు. క్రేజ్ వచ్చిందంటే చాలు ఒకసారి గా రెమ్యునరేషన్ పెంచి సినిమాల్లో నటించడం మొదలు పెడతారు.

వారికి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా వారికి అడిగినంత ముట్టజెప్పి వారి ఇమేజ్ తమ సినిమాకు ఉపయోగ పడేలా చేసుకుంటారు.  ఆ విధంగా ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులలో భారీ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ కృతి శెట్టి.  ఇంత చిన్న వయసులో అంత అద్భుతంగా నటించిన ఆమె గ్లామర్ పరంగా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.  దాంతో ఆమెను తప్పకుండా స్టార్ హీరోయిన్ చేస్తామని ప్రేక్షకులు శపథం చేశారు. దాంతో ఆమెకు ఉన్న క్రేజ్ ను చూసి దర్శక నిర్మాతలు కూడా ఆమెకు తమ సినిమాలలో అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే ఆమె రామ్ సరసన లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా నాని హీరోగా చేసిన శ్యామ్ సింగరాయ్ అనే సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా చేసింది.  ఈ రెండు చిత్రాలే కాకుండా మరిన్ని క్రేజీ చిత్రాలు కూడా ఆమెకు వచ్చాయని తెలుస్తోంది. పెద్ద హీరోల చూపు కూడా ఆమెపై పడింది. ఇప్పటికే మహేష్ బాబు ఎన్టీఆర్ వంటి హీరోలు ఆమెను హీరోయిన్ గా పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది. దాంతో తనకు పెరుగుతున్న క్రేజ్ ను చూసి కృతి శెట్టి ఇప్పుడు తను తీసుకుంటున్న రెమ్యునరేషన్ కి డబల్ డిమాండ్ చేస్తుందట. మరి కృతి అడిగిన రెమ్యూనరేషన్ నిర్మాతలు ఇస్తారా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: