మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళుతూ ఉండడం ప్రేక్షకులను ఎంతగానో సంతోషపరిచే విషయమే అయినా ఆచార్య సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాకపోవడం మాత్రం వారిని ఎంతో నిరాశపరుస్తుంది. ఇదిలా ఉంటే తాను ప్రస్తుతం చేస్తున్న మూడు సినిమాల పై కాన్సన్ట్రేట్ చేసి వాటిని పూర్తిచేసే విధంగా మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించుకున్నాడట. థియేటర్లలో పరిస్థితులు సరిగా లేకపోవడం వల్ల ప్రేక్షకులు సినిమాలకు పెద్ద గా రాకపోవడం వంటి కారణాలు ఆచార్య సినిమా విడుదల చేయక పోవడనికి ముఖ్య కారణాలు.

ఈ లోపు అన్ని పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని చెప్పి తన ఇతర నిర్మాణాలు పూర్తి చేయాలని భావిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ నేపథ్యంలోనే ఆయన మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ అనే సినిమాను త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. అయితే మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కూడా నవంబర్లో మొదలు పెట్టాలని భావిస్తున్నట్లూ వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం భోళా శంకర్ సినిమానే ఆయన ముందుగా మొదలు పెట్టబోతున్నాడట. దానికి కారణం గాడ్ ఫాదర్ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాలేదట.

దాంతో ఆల్రెడీ సిద్ధంగా ఉన్న సినిమా అయినా భోళా శంకర్ ను మొదలుపెట్టాలి అని చిరంజీవి  భావిస్తున్నాడట. ఇక ఈ రెండు సినిమాల తర్వాత బాబీ దర్శకత్వంలోని వాల్తేరు వీరన్న సినిమాను కూడా చిరంజీవి చేయబోతున్నాడు. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చిరంజీవి ఒప్పుకున్నాడని తెలుస్తోంది. ఇలా వరుస సినిమాలు ఒప్పుకుంటూ చిరంజీవి జెట్ స్పీడ్ తో దూసుకుపోతు ఉండడం విశేషం.ఇక సినిమా పరిశ్రమలో కూడా అయనపెద్దగా ఉంటూ సినిమా వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇటీవలే ఏపీ లో టికెట్ రేటు సమస్య ఉండడంతో దాన్ని రూపుమాపే విధంగా అయన సీఏం జగన్ తో మంతనాలు జరుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: