టాలీవుడ్
సినిమా పరిశ్రమలో ఇప్పుడు
హీరో ల మధ్య ఎంత పోటీ నెలకొందో వారు చేస్తున్న సినిమాలను బట్టి తెలుస్తుంది. దాదాపుగా రెండు సినిమాలను సెట్ చేసి తాము నెంబర్ వన్ రేసులో ఉన్నానని చాటి చెబుతూ ఉండగా
హీరో ఎన్టీఆర్ కూడా ఆ రేస్ లో ఉన్నానని ఆయన చేస్తున్న
సినిమా వరస ను బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం
రాజమౌళి దర్శకత్వంలో
ఆర్ఆర్ఆర్ అనే
సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ
సినిమా తర్వాత కూడా మంచి మంచి దర్శకులతో భారీ భారీ బడ్జెట్ లతో తెరకెక్కే పాన్
ఇండియా సినిమాలో లైన్ లో పెట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే
ఎన్టీఆర్ నెంబర్ వన్ స్థానానికి దూసుకుపోయే విధంగా తన సినిమాలను సెట్ చేసుకోవడం చూసి ఆయన అభిమానులు ఎంతగానో ఆనందపడుతున్నారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే
సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆయన వరస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
కేజిఎఫ్ సినిమా తో దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయన ఇప్పుడు
ప్రభాస్ సినిమా చేసి మరొకసారి పాన్
ఇండియా విధంగా సినిమాను చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే
ఎన్టీఆర్ లాంటి నటుడితో ఆయన ఎలాంటి
సినిమా తెరకెక్కిస్తాడో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
రాజమౌళి సినిమాను పూర్తి చేయగానే
కొరటాల శివ తో చేతులు కలపనున్నాడు ఎన్టీఆర్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్
సినిమా రాగా ఈ
సినిమా అంతకుమించి ఉండేలా ఈ చిత్రాన్ని ప్లాన్ చేశాడు. ఆచార్య ను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు
కొరటాల శివ.. కరోన అనేది రాకపోయి ఉంటే ఇప్పటికే ఆచార్య
సినిమా మరియు
ఆర్ఆర్ఆర్ సినిమా కూడా విడుదల అయ్యేది. కానీ
కరోనా అనే ఒక ఫ్యాక్టర్ తెలుగు
సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టినట్లుగా వీరిని కూడా ఇబ్బంది పెట్టి వారి సినిమాలను ఆలస్యం అయ్యేలా చేసింది. ఏదేమైనా ఈ మూడు సినిమాలను చేసిన తర్వాత
ఎన్టీఆర్ రేంజ్ అంతకంతకూ పెరిగి పోవడం ఖాయం.