అల్లు అర్జున్ మరియు సుకుమార్ ల హ్యాట్రిక్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియన్ చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 'ముత్తంశెట్టి మీడియా' సంస్థతో కలిసి 'మైత్రి మూవీ మేకర్స్' వారు నిర్మిస్తున్నారని అందరికి తెలిసిన విషయమే.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు పోస్టర్ అలాగే ఫస్ట్ సింగిల్ సినిమా పై మంచి హైప్ ను క్రియేట్ చేసాయని తెలుస్తుంది.చూస్తుంటే 'రంగస్థలం' కు మించి మాస్ కంటెంట్ మూవీ ఇదనే ఫీలింగ్ ను కలిగించాయని తెలుస్తుంది.పైగా ఇది రెండు భాగాలుగా విడుదల కాబోతుండడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగిందని తెలుస్తుంది..

పుష్ప సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఇక మొదటి భాగమైన 'పుష్ప ది రైజ్' షూటింగును 90 శాతం పూర్తయ్యిందని తెలుస్తుంది. పుష్ప సినిమా చివరి షెడ్యూల్ జరగాల్సి ఉందని తెలుస్తుంది.అయితే వర్షాల కారణంగా షూటింగుకు మళ్ళీ అంతరాయం కలిగిందని సమాచారం. దాంతో ఈ సినిమా నిర్మాతలు ముందుగా ప్రకటించినట్టు క్రిస్మస్ కానుకగా విడుదలయ్యే అవకాశాలు లేవని సినీ పరిశ్రమలో వార్త వినిపిస్తుందని సమాచారం.షూటింగ్ పూర్తయినప్పటికీ సుకుమార్.. రాజమౌళి సినిమాకు మించి ఉండేలా సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాబట్టి 2022 లోనే 'పుష్ప' విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే 'పుష్ప' కోసం అనుకున్న డేట్ కు మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ ల 'ఆచార్య' విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తుంది.

దీనికి సంబందించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని సమాచారం.ఇక 'పుష్ప' లో మలయాళం స్టార్ హీరో అయిన అలాగే జాతీయ అవార్డు విన్నర్ అయిన ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే స్టార్ యాంకర్ అయిన అనసూయ మరియు స్టార్ కమెడియన్ అయిన సునీల్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: