టాలీవుడ్ దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ నుండి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు హీరోలుగా నటిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ల ఫస్ట్ లుక్ టీజర్స్ రెండూ, అలానే దోస్తీ సాంగ్ అన్ని కూడా అందరి నుండి బాగా రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం గా అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ వ్యయంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా జరుపుకుంటున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఆకాశమే హద్దుగా అంచానాలు ఉన్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తుంగా శ్రియ, సముద్ర ఖని, అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇక స్వాతంత్రోద్యమానికి ముందు ఒకవేళ భీం, రామరాజు కలిస్తే ఏమయి ఉండేది అనే కోణంలో కొంత కల్పిత కథగా దర్శకుడు రాజమౌళి ఈ మూవీని యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తీసినట్లు సమాచారం.

ఇక మ్యాటర్ లోకి వెళితే ఎప్పుడో గత ఏడాది జులై లోనే విడుదల కావలసిన ఈ సినిమా మధ్యలో పలు కారణాల వలన చాలా సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాని రాబోయే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయనున్నారని, ఇప్పటికే మేకర్స్ తమ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ కి ఈ విషయాన్ని వెల్లడించినట్లు నేడు ఉదయం నుండి ఒక వార్త విస్తృతంగా ఫిలిం నగర్ వర్గాలలో చక్కర్లు కొడుతోంది. అలానే తాజా విడుదల తేదీకి సంబందించి రేపు గాంధీ జయంతి సందర్భంగా అఫీషియల్ గా ఆర్ఆర్ఆర్ యూనిట్ నుండి అనౌన్స్ మెంట్ కూడా రానుందట. మరి ఇదే కనుక నిజం అయితే ఆర్ ఆర్ఆర్ మూవీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: