మెగాస్టార్ చిరంజీవి హీరోగా తొలిసారిగా ఆయన తో కలిసి తనయుడు రామ్ చరణ్ కూడా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆచార్య. తోలి సినిమా మిర్చి మొదలుకొని మొన్నటి భరత్ అనే నేను వరకు వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న కొరటాల శివ తీస్తున్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు ఎంతో భారీగా నిర్మిస్తుండగా ఈ మూవీ ని మెసేజ్ తో కూడిన భారీ యాక్షన్ కమర్షియల్ మూవీ గా దర్శకుడు కొరటాల శివ తీస్తున్నట్లు టాక్.

ఇక ఇటీవల చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ అలానే పూజా హెగ్డే హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తుండగా ఇందులో ఫస్ట్ సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో విడుదలై అందరి నుండి సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే మాజీ నక్సలైట్ పాత్ర చేస్తున్న ఈ సినిమా కొన్నేళ్ల క్రితం జరిగిన దేవాలయ భూముల వివాదాల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు టాక్. మెగాఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా ఈ ఆచార్య మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.

నిజానికి ఈ సినిమాని ఈ ఏడాది మే లో విడుదల చేయాలని భావించి అప్పట్లో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన యూనిట్ మధ్యలో కరోనా కారణంగా దానిని వాయిదా వేసింది. ఇక కేవలం కొద్దిపాటి షూట్ మాత్రమే మిగిలిందని త్వరలో దానిని పూర్తి చేసి ఆపై పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి అయిన అనంతరం సినిమాని ఈ ఏడాది డిసెంబర్ మూడవ వారంలో విడుదల చేసేలా యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు టాక్. నిజానికి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది అంటూ కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ సమయానికి మరోవైపు పలు బడా సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడంతో ఒకింత ముందుగానే ఆచార్యని థియేటర్స్ లోకి తీసుకువచ్చేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: