ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ టాక్ షో మొదటి అవరోధాలు అధిగమించి గత కొన్నిరోజులుగా మంచి రేటింగ్స్  తెచ్చుకుంటోంది. ఈపరిస్థితుల నేపధ్యంలో ఈషో నిర్వాహకులు ఒక వినూత్న ఆలోచన చేసారు. ఇప్పటికే ఈ షోలో ముఖ్య అతిధులుగా రామ్ చరణ్ రాజమౌళి కొరటాల శివ లు పాల్గొన్న స్పెషల్ ఎపిసోడ్స్ కు మంచి రేటింగ్స్ రావడంతో ఇప్పుడు ఇదే వ్యూహాన్ని మహేష్ ప్రభాస్ ల సహకారంతో అనుసరించబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.


వచ్చే నెలలో రాబోతున్న దసరా పండుగరోజున మహేష్ అతిధిగా వచ్చిన ఈ షోకి సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ రికార్డింగ్ పూర్తి అయినట్లు టాక్. మహేష్ ఈషోలో చాల ఉత్సాహంగా పాల్గునడమే కాకుండా 25 లక్షల క్యాష్ ను గెలుచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇప్పుడు ప్రభాస్ ను కూడ రంగంలోకి దింపితే ఈషోకి మరింత ఎక్కువగా రేటింగ్స్ వస్తాయి అన్న ఉద్దేశ్యంతో ఈషో నిర్వాహకులు ప్రభాస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. వాస్తవానికి ప్రభాస్ ఇలాంటి టాక్ షోలకు చాల దూరంగా ఉంటాడు. కాని ఏదోవిధంగా అతడిని ఒప్పించి జూనియర్ ఎదురుగ హాట్ సీట్ పై ప్రభాస్ ను కూర్చోపెడితే ఈషోకు వచ్చే రేటింగ్స్ అద్భుతంగా ఉంటాయని జెమినీ ఛానల్ నిర్వహాకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈషో రికార్డింగ్ వచ్చే నెలలో పూర్తి చేసి నవంబర్ లో వచ్చే దీపావళి రోజున ఈ స్పెషల్ షోను టెలికాస్ట్ చేయాలని ఈ షో నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ప్రభాస్ లు ఒకే సినిమాలో నటిస్తే చూడాలని ఎంతోమంది అభిమానులు ఆశ పడుతున్నారు. ముఖ్యంగా యూత్ లో వీరిద్దరికీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇలాంటి పరిస్థితులలో వీరిద్దరినీ బుల్లితెర పై చూసిన అభిమానులకు నిజమైన దీపావళి పండుగ కనిపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు..  



మరింత సమాచారం తెలుసుకోండి: