ప్రస్తుతం బుల్లితెరపై తిరుగులేని కామెడీ షో గా కొనసాగుతూ ఎన్నో ఏళ్ల నుంచి టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటు పోతుంది జబర్దస్త్ కార్యక్రమం.  జబర్దస్త్ లో ఎంతో మంది కొత్త కమెడియన్స్ వస్తున్నారు పోతున్నారు. కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు ఎంత టెన్షన్ లో ఉన్న కాసేపు హాయిగా నవ్వుకోవడానికి జబర్దస్త్ చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అని చెప్పాలి.  ఇలా ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో దగ్గర అయింది ఈ కామెడీ షో.  అయితే జబర్దస్త్ లో ఎప్పుడూ ఏదో ఒక జోడి బాగా పాపులర్ అవుతూ ఉంటుంది.



 జబర్దస్త్ లో ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ కూడా సుడిగాలి సుధీర్ రష్మీ  జోడి జబర్దస్త్ ప్రేక్షకులందరికీ కూడా ఫేవరెట్ జోడీగా కొనసాగుతోంది  ఇక ఆ తర్వాత కాలంలో అనసూయ హైపర్ ఆది  జోడి కొన్నాళ్ళ వరకు ప్రేక్షకులను ఆకర్షించింది. ఇటీవలి కాలంలో వర్ష ఇమాన్యుల్ జోడి కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాదు జబర్దస్త్ బ్లాక్ అండ్ వైట్ జోడిగా కూడా ఇద్దరూ ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నారు.  ఇక గత కొన్ని రోజుల నుంచి జబర్దస్త్ లో ఎక్కువగా పాపులారిటీ సంపాదించి బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తున్న జోడి ఏది అంటే.. రాకింగ్ రాకేష్ రోహిణి జోడి అని చెప్పాలి.



 ఒకప్పుడు సీరియల్స్ లో అలరించిన రోహిణి ఇటీవలే రాకింగ్ రాకేష్ టీమ్ లో జబర్దస్త్ లో తనదైన శైలిలో కామెడీ చేస్తూ అదరగొడుతుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే వీరి మధ్య కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయింది.  ఇక కొన్ని కొన్ని సార్లు స్కిట్ లో భాగంగా ఒకరికి ఒకరు ముద్దుపెట్టుకోవడం లాంటివి కూడా అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇటీవలే విడుదలైన జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  ఈ ప్రోమో లో భాగంగా ఏకంగా  రాకింగ్ రాకేష్..  అందరి ముందే రోహిణి కి ప్రపోజ్ చేశాడు. జబర్దస్త్ అందరికీ లైఫ్ ఇచ్చింది కానీ నాకు మాత్రం వైఫ్ ఇచ్చింది అంటూ మోకాళ్ళపై కూర్చుని రోజా పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అంతేకాదు ఐదేళ్ల పరిచయానికి గుర్తుగా  ఐదు రకాల సర్ప్రైజ్ లు ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: