అయితే ఇప్పుడు ఈ ఆర్ ఆర్ ఆర్ కు పోటీగా మరో ఆర్ ఆర్ ఆర్ వస్తోంది. వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు కూడా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ అయిపోయారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం, జగన్ పై పదే పదే విమర్శలు చేస్తోన్న ఆయన మరో బాంబు పేల్చారు. తాను తీసే ఆర్ ఆర్ ఆర్ 2024 ఎన్నికల నాటికి రిలీజ్ చేస్తానంటున్నారు ఈ ఎంపీ. ఈ మేరకు కథా చర్చలు, సంప్రదింపులు ప్రారంభించినట్టు కూడా ఆయన చెప్పారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితు ల నేపథ్యంలో ఓ సినిమా తీయాలని ఉందన్న ఆయన .. తా ను ప్రస్తుతం వైసీపీ లో ఉన్నందున ఆ సినిమా తీయలేనని. తాను వైసీపీ నుంచి బయటకు వచ్చాకే ఆ సినిమా తీస్తానని చెప్పారు.
ఇప్పటికే సినిమా వాళ్లతో చర్చలు జరుగుతున్నందున దీనిపై కొద్ది రోజుల లో క్లారిటీ వస్తుందన్నారు. కొందరు స్క్రిఫ్ట్ లతో సహా తనను కలిశారని.. అవి కాకుండా నా మైండ్ లో వేరే స్క్రిప్టు ఉందని కూడా వాళ్లతో చెప్పానని.. ఆ టైమ్ వస్తే తప్పకుండా సినిమా తీస్తానని ఆర్ ఆర్ ఆర్ చెప్పారు. 2024 ఎన్నికల నాటికి ఆ సినిమా రిలీజ్ ఉంటుందని ఆయన చెప్పారు. ఇక చంద్రబాబు బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటే మంచిదని కూడా ఆయన సలహా ఇచ్చారు.