- చైతు - సమంత ఏమాయ చేశావే సినిమాతో తొలిసారిగా కలిసి నటించారు. ఆ సినిమా చైతుకు రెండో సినిమా. ఆ సినిమాతోనే సామ్ హీరోయిన్ అయ్యింది. 2010లో ఈ సినిమా వచ్చింది
- 2014లో వీరి కాంబినేషన్లో అక్కినేని ఫ్యామిలీ సినిమా మనం వచ్చింది.
- అదే 2014లోనే వీరి కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా ఆటోనగర్ సూర్య వచ్చింది. పలు వాయిదాలు పడిన తర్వాత ఆ యేడాది ఈ సినిమా ను రిలీజ్ చేశారు. అప్పటికే ఈ జంట ప్రేమలో మునిగి తేలుతోంది.
- వీరి ప్రేమ గురించి నాగార్జునకు తెలియడంతో ఆయన చైతు ద్వారా అసలు విషయం తెలుసుకున్నాడు. అయితే ముందుగా అఖిల్కు ఎంగేజ్మెంట్ చేసి .. అఖిల్ పెళ్లి తర్వాత చైతు - సామ్ పెళ్లి చేయాలనుకున్నాడు. అయితే అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడంతో చైతు - సామ్ పెళ్లి గోవాలో ఘనంగా జరిగింది.
- 2017 అక్టోబర్ 6న వీరి పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక కేవలం టాలీవుడ్లోనే కాకుండా సౌత్లోనే మోస్ట్ రొమాంటిక్ కఫుల్స్గా ఈ జంట నిలిచింది. వీరు ఏం చేసినా.. ఎక్కడ ఉన్నా కూడా సంచలనంగానే ఉండేది.
- పెళ్లయ్యాక కూడా ఈ జంట మజిలీ సినిమాలో నటించారు. మొత్తం వీరి కాంబోలో నాలుగు సినిమాలు వచ్చాయి.
- తన మామ నాగార్జునను సామ్ నాగ్ మామ అని ముద్దుగా పిలుస్తూ ఉంటుంది. నాగార్జునతో కలిసి ఆమె మనంతో పాటు రాజుగారి గది 2 సినిమా కూడా చేసింది.
- ఈ జంట వైవాహిక బంధం మరో నాలుగు రోజుల్లో నాలుగేళ్లు పూర్తి చేసుకుంటోన్న క్రమంలోనే వీరు విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు.