మెగాస్టార్
చిరంజీవి ప్రస్తుతం ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. వాటిలో మొదటగా
మోహన్ రాజా దర్శకత్వంలో
గాడ్ ఫాదర్ అనే సినిమాను చేస్తున్నాడు. ఆచార్య సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉన్న
మెగాస్టార్ చిరంజీవి ఆ చిత్రాన్ని మంచి సమయం చూసుకొని విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో
సినిమా ను విడుదల చేయాలనీ మెగా అభిమానుల నుంచి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని ఒక చిన్న హింట్ ఇచ్చాడు ఇటీవలే. దాంతో ఆచార్య
సినిమా డిసెంబర్ కు రాబోతుంది అని సంబరాలు చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.
ఇక
గాడ్ ఫాదర్ విషయానికి వస్తే ఈ చిత్రాన్ని మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు చిరంజీవి. మొదట ఈ సినిమాకి దర్శకుడు సుజిత్ కాగా అయన స్క్రిప్ట్ తో చిరు ను పెద్దగా మెప్పించలేకపోయాడు. దాంతో అతని పక్కన పెట్టి వి.వి.వినాయక్ కు ఛాన్స్ ఇచ్చాడు. గతంలో మంచి మంచి సినిమాలు చేసిన
వి వి వినాయక్ మెగాస్టార్ ను తన స్క్రిప్ట్ తో మెప్పిస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ
మెగాస్టార్ ను ఒప్పించడం ఆయన వల్ల కూడా కాలేదు. తాజాగా తమిళంలో
రీమేక్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న దర్శకుడు
మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడిగా ఎంపిక అయ్యాడు
గాడ్
ఫాదర్ సినిమా కూడా
రీమేక్ కావడంతో ఆయనకు ఈ
సినిమా చేయడం చాలా సులువు అయిపోయింది. అలా
గాడ్ ఫాదర్ సినిమా స్క్రిప్ట్ ను హ్యాండిల్ చేసి ఇ చిరంజీవిని ఒప్పించి ఈ
అక్టోబర్ లో లో సెట్స్ మీదకు తీసుకు వెళ్లే విధంగా ప్లాన్ చేశాడు. అయితే అనూహ్యంగా ఈ సినిమాలో
పూరి జగన్నాథ్ హస్తం కూడా ఉందని ఇప్పుడు తెలుస్తుంది. గతంలో
మెగాస్టార్ తో 150వ సినిమాను
పూరి జగన్నాథ్ చేయాల్సి ఉండగా అది ఆగిపోయింది. ఇప్పుడు
గాడ్ ఫాదర్ సినిమాకి
పూరి జగన్నాథ్ పనిచేయడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. మరి భవిష్యత్తులో ఇది పూర్తి చేతిలోకి వెళ్తుందా లేదా సహకారం మాత్రమే అందిస్తాడా అనేది చూడాలి.