హీరో
గోపీచంద్ ఇటీవల సిటీ మార్
సినిమా తో మంచి విజయాన్ని సాధించుకుని ఫుల్
జోష్ లో ఉన్నాడు.
సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
సినిమా ఆయనకు చాలా రోజుల తర్వాత మంచి హిట్ ను అందించింది అని చెప్పవచ్చు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన
గౌతమ్ నంద అనే సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. గోపీచంద్ కూడా ఈ చిత్రం ప్రేక్షకులను బాగా మప్పించి తనకు గొప్ప విజయాన్ని అందిస్తుందని అనుకున్నారు.
కానీ ఈ
సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. దీంతో తనకు మరొక హిట్ తప్పనిసరి అయింది. అయినా కూడా ఆయన వరుస సినిమాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దాంతో ఈ సినిమాపై బాగానే నమ్మకం పెట్టుకున్నాడు. అలా ఆ
సినిమా విడుదలైన రోజు నుంచి ప్రేక్షకులను బాగా మెప్పిస్తు సూపర్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆగిపోయిన
సినిమా ఆరడుగుల బుల్లెట్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతూ ఉండగా అది ఆయన లో ఎంతో భయాన్ని కలిగిస్తుంది అని తెలుస్తుంది.
ఎందుకంటే ఇప్పుడు అంతంత మాత్రంగానే తన కెరీర్ ఉంది. హిట్ పడితే పర్వాలేదు కానీ వరుస ఫ్లాపుల్లో గుడ్డిలో మెల్ల అన్నట్లు సీటీ మార్
సినిమా హిట్ అయి తన పరువు కాపాడింది. అలాంటి ఎప్పుడో 2015లో ఆగిపోయిన
సినిమా ఇప్పుడు విడుదల అంటే అప్పటికీ ఇప్పటికీ చాలా తేడాగా ఉంటుంది. కాన్సెప్ట్ కూడా చాలా ఓల్డ్ అయిపోయి ఉంటుంది. ఫేస్ షేపులు కూడా అన్ని మారిపోయి ఉన్న నేపథ్యంలో ఈ
సినిమా విడుదల అయ్యి తనకు ఎలాంటి ఫ్లాప్ నీ తీసుకొస్తుందో అని భయపడుతున్నాడట గోపీచంద్. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు
బి గోపాల్ దర్శకత్వం అందించగా గతంలో చాలాసార్లు ప్రయత్నించినా కూడా ఈ చిత్రం విడుదల కాలేకపోయింది.