టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారుతున్న నాగ చైతన్య, సమంత ల విడాకుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.ఈ ఇద్దరూ నిజంగానే విడిపోతున్నట్లుగా నిన్న తమ సోషల్ మీడియాలలో అధికారికంగా ప్రకటించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయ్యింది.ఇక అటు నాగార్జున కూడా వీరి విడాకుల విషయంపై బాధపడుతూ.. వారి వ్యక్తిగత నిర్ణయాలను గౌరవిస్తున్నట్లు స్పందించారు.ఇక ఇదిలా ఉంటె నాగ చైతన్య మాత్రం తన విడాకుల తర్వాత చాలా కూల్ గా ఎప్పటిలాగే తన సినిమా కెరీర్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.అయితే నిన్న సోషల్ మీడియా వేదికగా చైతూ పోస్ట్ చేస్తూ..

ఈ ఘటన సమయంలో తమకి ప్రైవసీ చాలా అవసరం అని అటు చైతూ తో పాటూ సమంత కూడా అభిమానుల  మద్దతు అలాగే మీడియా వైపు నుండి సపోర్ట్ కూడా కావాలని కోరుకున్నారు.అయినప్పటికీ వీరిపై అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.అయితే ఈ విషయం పై పెద్దగా పట్టించుకోని నాగ చైతన్య.. తన తదుపరి సినిమా ప్రాజెక్టు లతో బిజీ అవ్వాలని అనుకుంటున్నాడట.ప్రస్తుతం విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా అనంతరం చైతూ ఓ వెబ్ సీరీస్ లో నటించనున్నాడు.ఆ వెబ్ సీరీస్ ని కూడా విక్రమ్ కె. కుమారే డైరెక్ట్ చేస్తుండటం విశేషం.

ఇక వీటితో పాటూ తాజాగా మరో మల్టీస్టారర్ ప్రాజెక్ట్ పై చైతూ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ మల్టీస్టారర్ కి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.అయితే ఆ దర్శకుడు ముందుగానే ఒక స్టార్ హీరో కి కథను వినిపించినట్లు తెలుస్తోంది.ఆ హీరో మరెవరో కాదు. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.త్వరలోనే నాగ చైతన్య, రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమాలో  నటించనున్నాడు.త్వరలోనే ఈ మల్టీస్టారర్ కి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలను మేకర్స్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఇక తాజాగా లవ్ స్టోరీ సినిమాతో కెరీర్లో బిగ్ సక్సెస్ ని అందుకున్న చైతూ.. ఇప్పుడు వరుస ప్రాజెక్ట్ లతో దూసుకుపోతున్నాడు.మరి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తో చైతూ ఇంకెలాంటి విజయాలను సొంతం చేసుకుంటాడో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: