స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న పుష్ప సినిమాను డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపిస్తుండగా మొట్ట మొదటి సారిగా ఢీ గ్లామర్ రోల్ లో ఆయన కనిపిస్తుండటం ఈ సినిమాపై అంచనాలను పెంచుతుంది.

ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమా డిసెంబర్ లో విడుదల అవదు అని సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేశారు. వాటన్నిటికీ సమాధానం ఇస్తూ ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించే సరికి ఈ సినిమా పై వచ్చే పుకార్లు అన్నీ ఆగి పోయాయి. అయితే ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు స్పందిస్తున్న కూడా అల్లు అర్జున్ ఇంకా స్పందించకపోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. ఇండస్ట్రీలోని వార్తల ప్రకారం గుడ్డిగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారని ఆ తేదీ వరకు ఈ సినిమా రావడం చాలా కష్టమని చెబుతున్నారు.


ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను ఏమీ అడక్కుండానే ఈ తేదీని విడుదల ప్రకటించడం ఆయనకు నచ్చలేదట. ఒకసారి విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ఆ రోజున రాకపోతే భారీ స్థాయిలో సినిమా పరువు పోతుంది కాబట్టి అన్ని పకడ్బందీగా ఏర్పాటు చేసుకున్న తరువాత ఈ సినిమాను విడుదల విడుదల తేదీని ప్రకటిస్తే బాగుంటుందని అల్లుఅర్జున్ చెప్పినా కూడా సుకుమార్ వినకుండా తప్పకుండా ఈ సినిమాను విడుదల చేస్తామని ఒప్పించి మరీ అనౌన్స్ చేశాడట. ఈనేపథ్యంలో అల్లు అర్జున్ చెప్పినట్లుగా చేయకపోవడంతో ఆయన సినిమా విడుదల పై ఏమాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: