ప్రస్తుతం టాలీవుడ్ లో సమంత, నాగ చైతన్య ల విడాకుల విషయం హాట్ టాపిక్ గా మారిన విషయం తెల్సిందే. మొదటిసారిగా ఈ ఇద్దరు ఏ మాయ చేసావే సినిమా ద్వారా కలిసి నటించడం జరిగింది. వాస్తవానికి ఆ మూవీ ద్వారానే తెలుగులోకి హీరోయిన్ గా సమంత ఎంట్రీ ఇచ్చారు. గౌతమ్ మీనన్ తీసిన ఆ సినిమాని ఇందిరా ప్రొడక్షన్స్ సంస్థపై మంజుల ఘట్టమనేని నిర్మించారు.
కాగా ఫస్ట్ మూవీ తోనే సూపర్ హిట్ తో పాటు యువతలో హీరోయిన్ గా మంచి క్రేజ్ అందుకున్న సమంత ఆపైన మహేష్ తో దూకుడు, ఎన్టీఆర్ తో బృందావనం, ఆపైన రాజమౌళి తీసిన ఈగ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో నటించి స్టార్ హీరోయిన్ అయ్యారు. ఇక ఆ తరువాత నుండి వేగంగా పలు సక్సెస్ లతో దూసుకెళ్లిన సమంత, తన మొదటి మూవీ హీరో చైతన్యని ప్రేమించి మరీ కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి వీరిద్దరి దాంపత్యం ఎంతో ఆనందంగా సాగుతోంది. అయితే హఠాత్తుగా ఈ ఇద్దరూ కూడా విడాకులు తీసుకుంటున్నట్లు నిన్న ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. నిజానికి వీరి విడాకులు పై కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు వచ్చినా అవి నిజం కాదని పలువురు భావించారు.

కాగా అది నిజం కావడంతో ఎవరికీ కూడా ఏమి కూడా అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది. అయితే విషయం ఏమిటంటే, చైతన్య సమంత ఇద్దరి విడాకుల విషయంలో అఖిల్ ఎంతో కేర్ తీసుకుని దానిని ఆపేందుకు ప్రయతించారట. జీవితంలో ఒకసారి కలిసి కొనసాగాలి అని నిర్ణయించాక మధ్యలో సడన్ గా విడిపోవడం ఎంత వరకు కరెక్ట్, దయచేసి ఒక్కసారి ఇద్దరూ ఈ విషయమై పునరాలోచించాలని అఖిల్ అన్న వదినలు ఇద్దరినీ కోరినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయిందట. అయితే అంతకు మించి అన్న వదినలు వ్యవహారంలో తలదూర్చడం ఇష్టం లేని అఖిల్ కూడా ఆపైన మిన్నకుండిపోయారని టాలీవుడ్ వర్గాల టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: